*బిజెపి జాతీయ అధ్యక్షులు* *నితిన్ నబీన్కు గంట్ల శ్రీనుబాబు సాదర స్వాగతం* *సింహాద్రినాథుడి జ్ఞాపిక"‘పవిత్రం.. క్షేత్ర మహత్యం’ పుస్తకం బహూకరణ*
విశాఖపట్నం న్యూస్/భోగాపురం: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నాయకులు, డాక్యార్డ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు నితిన్ నబీన్కు సింహాద్రినాథుడి జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. అలాగే సింహాచల క్షేత్ర విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని వివరించే ‘పవిత్రం.. క్షేత్ర మహత్యం’ పుస్తకాన్ని బహూకరించారు.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి సంబంధించిన విశేషాలను నితిన్ నబీన్కు గంట్ల శ్రీనుబాబు వివరించారు. క్షేత్ర మహత్యం, చారిత్రక ప్రాధాన్యం, ఆధ్యాత్మిక విశిష్టతలను ఆయనకు తెలియజేశారు.
ఈ సందర్భంగా నితిన్ నబీన్ సింహాద్రినాథుడి జ్ఞాపిక, పుస్తకాన్ని అందించిన గంట్ల శ్రీనుబాబుకు ప్రశంసలు తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి తొలిసారిగా వచ్చిన సందర్భంగా సింహాచలం క్షేత్ర ప్రసాదాన్ని, జ్ఞాపికను అందుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సింహాచలం క్షేత్ర విశిష్టతను పరిచయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని గంట్ల శ్రీనుబాబు తెలిపారు. ఉత్తరాంధ్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి సింహాచలం క్షేత్రం ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు.


Comments
Post a Comment