Skip to main content

నగర అభివృద్ధిలో నిర్వహణ అత్యంత కీలకం * జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ * చరిత్రలో ఎప్పటికీ నిలిచి జ్ఞాపకాన్ని మిగిల్చేవి ఫోటోలు మాత్రమే * గొప్ప ఛాయాచిత ప్రదర్శనను అన్ని వర్గాల ప్రజలు వినియోగించుకోవాలి

.                   K.V.SHARMA EDITOR 
విశాఖపట్నం,ఆగస్టు 19 :  మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అభివృద్ధికి నిరంతరం కృషి చేయడం జరుగుతుందని,  దాంతో పాటు నిర్వహణ కూడా అత్యంత కీలకమని అప్పుడే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయగలమని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా  డిజిటల్ యోగం వచ్చిందని .. అయితే మన జ్ఞాపకాలను ఎప్పటికీ బంధించేది మాత్రం ఒక్క ఫోటో మాత్రమేనని అభిప్రాయపడ్డారు.వైజాగ్‌ ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్‌ ఆధ్వర్యంల


 ఈ నెల 19, 20 తేదిల్లో బీచ్ రోడ్ లోని విశాఖ మ్యూజియం వేదికగా జరుగుతున్న ఫోటో ఎగ్జిబిషన్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి  గత ఏడాది నుంచి నేటి వరకు వైజాగ్ ఫోటో జర్నలిస్టులు తీసిన అత్యంత గొప్ప ఛాయాచిత్రాలను నిశితంగా పరిశీలించి ఆనాటి జ్ఞాపకాలను.‌‌..


 అప్పటి ఘటనలను ఫోటోగ్రాఫర్లు బంధించిన దృశ్యాలను చూసి కాసేపు ఆశ్చర్యానికి గురయ్యారు. మరో మారు ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఫోటోగ్రఫీ అంటే వాస్తవ పరిస్థితిని కళ్ళకు చూపించే గొప్ప కల అని తెలియజేశారు. సహజమైన రీతిలో బుర్రకు పదును పెడుతూ. తమదైన నైపుణ్యాన్ని ఫోటోగ్రాఫర్ల ద్వారా వెలుగులోకి తీసుకొస్తాయని తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఈ ప్రదర్శన మరింత ముందుకి సాగాలని ఆకాంక్షించారు. నగరంలోని జీవీఎంసీ ప్రదర్శన డిస్ప్లే బోర్డుల ద్వారా మరో వారం పది రోజులపాటు  ఇవి ప్రదర్శన జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.


 కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన వైజాగ్ ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్  అధ్యక్షులు వై .రామకృష్ణ మాట్లాడుతూ రెండు రోజుల ఫోటో ఎగ్జిబిషన్ కు సహకరించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ కు తమ సభ్యులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలియజేశారు. విశాఖ మ్యూజియంలో విశాఖపట్నంలో జరిగే ముఖ్యమైన ఈవెంట్ల లో ఫోటోగ్రాఫర్లు తీసే చిత్రాలను విశాఖ మ్యూజియంలో  ప్రదర్శించాలని తద్వారా నగర పర్యటనకు వచ్చే సందర్శకులు, విద్యార్థులకు  నగర అభివృద్ధి , ముఖ్యమైన అంశాలు తెలియచేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ను ఘనంగా సభ్యులందరూ కలిసి సత్కరించి సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ ఫోటోగ్రఫీ పోటీల్లో జాతీయ అవార్డు 


పొందిన కె ఆర్ దీపక్, కన్సోలేషన్  అవార్డులు పొందిన వై. రామకృష్ణ, పి ఎల్. మోహన్ రావు, ఆలపాటి శరత్ కుమార్, పిల్లా నగేష్, కే మురళీకృష్ణ, టి. గణేష్ కుమార్ లను జీవీఎంసీ కమిషనర్ చేతుల మీదుగా సత్కరించి జ్ఞాపకను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టుల కార్యదర్శి గంట్ల శీను బాబు, నగరానికి చెందిన మేధావులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


పెద్ద సంఖ్యలో సందర్శించిన విద్యార్థులు సందర్శకులు ....తొలిరోజు ఫోటో ఎగ్జిబిషన్ వివిధ పాఠశాలలు కళాశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సందర్శించారు. పలు వీరు విద్యార్థులు ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించి తమ అనుభూతులను పంచుకున్నారు.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు సైతం అత్యద్భుతమైన ఫోటోలను చూస్తూ... సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...