విశాఖపట్నం :విశాఖ సందేశం న్యూస్బ:లెటిన్ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ వారు 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వివేకానంద సంస్థ
గౌరవ అధ్యక్షులు డాక్టర్.C.M.A. జహీర్ అహ్మద్ యువ నాయకులు ద్రోణం రాజు. శ్రీవత్సవ , ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మాజీ చైర్మన్ మక్సుద్ అహ్మద్, జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు, 450 అడుగుల జాతీయ జెండా ర్యాలీని నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్, బిస్కెట్లు, చాక్లెట్లను పంపిణీ చేశారు. డాక్టర్ మాట్లాడుతూ అనేక వేల మంది భారతీయుల త్యాగ ఫలితమే
ఈ స్వాతంత్ర దినోత్సవం.1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన రోజు. దాదాపు 200 సంవత్సరాలు మన దేశాన్ని పాలించి, మనల్ని బానిసలుగా చేసిన ఆంగ్లేయులను ఎంతోమంది భారతీయులు ఎదిరించి, ప్రాణాలను అర్పించారు అని తెలియజేశారు, వాత్సవ మాట్లాడుతూ
, ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని కలిగి ఉండాలని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల చరిత్రలను తెలుసుకొని, వారిని ఆదర్శంగా తీసుకొని వారి మార్గంలో నడవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అప్పారావు, సంస్థ సభ్యులు చోడి పిల్లి. అప్పారావు, కోటేశ్వరరావు, సత్తిబాబు, అప్పలకొండ, మరియుT. కృష్ణ, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.



Comments
Post a Comment