Skip to main content

బీజేపీ జిల్లా కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు*

.               D.S.VARMA Sr Sub EDITOR 
విశాఖపట్నం :ఈరోజు 15-08-2026 శనివారం ఉదయం 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు గారి అధ్యక్షతన లాసన్స్ బే కాలనీ లోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ N మధుకర్ జి విచ్చేసారు.


ఈ సందర్భంగా ఈ సందర్భంగా మధుకర్ జి మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో విశాఖ పుర ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్య్ర పోరాట ఉద్యమంలో అసువులు బాసిన అనేక వేలమంది స్వాతంత్య్ర పోరాట వీరులను స్మరిస్తూ, హర్ ఘర్ తిరంగా పేరుతో మన దేశంలోని ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుందని అన్నారు. బ్రిటీష్ పాలనలో ఆర్ధిక దోపిడీ, అభివృద్ధి లేమితో కొట్టుమిట్టాడిన భారతదేశం ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించింది అన్నారు. బ్రిటీష్ పరిపాలనకు పూర్వం, గుప్తుల కాలంలో ప్రపంచ ఆర్ధిక రంగంలో భారతదేశ వాటా 50 % గా ఉండేదని, ఆ తరువాత బ్రిటీష్ పాలనలో మందగించిందని గుర్తు చేసారు.


జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు గారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేడు 4 వ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ అవతరించిందని అన్నారు. స్వచ్ఛ భారత్ ద్వారా గ్రామాలలో, నగరాలలో పారిశుధ్యం పెంపొందించి, సౌభాగ్య పథకం ద్వారా విద్యుత్ కు నోచుకోని అనేక గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించారని కొనియాడారు. భారత దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా అనేక చారిత్రాత్మక, ప్రజోపయోగ నిర్ణయాలను తీసుకున్న ప్రధాని మోదీ ప్రభుత్వం దేశ ఆర్ధిక వ్యవస్థను, ప్రతిష్టను పటిష్ట పరుస్తూ ఆత్మనిర్భర భారత్ దిశగా పురోగమిస్తున్నదని కొనియాడారు.


ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జోనల్ ఇంచార్జి మట్ట ప్రసాద్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మిడి సుజాత, బీజేపీ రాష్ట్ర కోశాధికారి M నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. K సుహాసిని ఆనంద్, బీజేపీ శ్రీకాకుళం జిల్లా ఇంచార్జి SVS ప్రకాష్ రెడ్డి, బీజేపీ విజయనగరం జిల్లా ఇంచార్జి N విజయానంద రెడ్డి, బీజేపీ పార్వతీపురం జిల్ ఇంచార్జి పొలిమేర శ్రీనివాస రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు G ప్రేమ కుమారి, సాగి కాశీవిశ్వనాథ రాజు గారు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...