ఇసుకకొండ దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ దేవాదాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కార్య నిర్వహణ అధికారి టి రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో ఉచిత రీతిన సామూహికంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు పి నరసింహచార్యులు శ్రీ పాంచరాత్ర ఆగమ సాంప్రదాయంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను నిర్వహించారు . హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ( హెచ్ డి పి టి ) దేవదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత రీతిన నిర్వహించిన వ్రతాలలో 325 మంది జంటలు పాల్గొని వ్రతాలను ఆచరించుకుని అలయంలో వేంచేసియున్న శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు . ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ టి అన్నపూర్ణ , హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు , ప్రాంతీయ సమన్వయకర్త జి ఆర్ కే ప్రసాద్ ( రాంబాబు ) , హెచ్ డి పి టి సభ్యులు ఆధ్యాత్మికవేత్త ఎం వి రాజశేఖర్ , పి జగన్ మోహనరావు , ఎమ్ వి కే కే సత్యనారాయణ , ఆలయ చైర్మన్ , ధర్మకర్తల మండలి సభ్యులు , హెచ్ డి పి టి అనకాపల్లి జిల్లా సభ్యులు , ఎఎస్ఆర్ జిల్లా సభ్యులు , నర్సీపట్నం సభ్యులు , అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు . కార్యక్రమానికి ముందుగా శుభ సూచకంగా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ప్రాంతీయ కార్యదర్శి డాక్టర్ జి.ఆర్ కె ప్రసాద్ (రాంబాబు) ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ రాజగోపాల్ రెడ్డి ఆలయ బోర్డ్ చైర్మన్ ప్రసాద్ అలాగే హెడ్ టి పి టి సభ్యులు బోర్డు సభ్యులు కలిపి జ్యోతి ప్రకాశనం చేసి శుభారంభం చేశారు.
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాసులు IAS (R) మాట్లాడుతూ వ్రతాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయబోతున్నామని ఆలయ అధికారి లకు ఆలయ చైర్మన్ కి సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు .
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ 'ధర్మో రక్షతి రక్షితః" ధర్మాన్ని రక్షించడం, కాపాడడం ,పెంపొందింప చేయడం హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం అని అందులో భాగంగా బీద బడుగు వర్గాల వారికే కాకుండా అందరికీ ఉచితంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరింపచేసి ఆ స్వామి అనుగ్రహం వారి మీద పూర్తిగా ఉండాలని వారందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. స్థలాభావం అయినప్పటికీ
వచ్చిన భక్తులందరికీ వ్రతం చేసుకునే భాగ్యం కలిగించడం జరిగింది.
పూజా సామాగ్రి కూడా దేవస్థానమే సమకూర్చి పూర్తిగా ఉచితంగా వ్రతాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
దేవస్థానం కార్య నిర్వహణ అధికారి టి రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో ట్రస్టు బోర్డు సభ్యుల సహకారంతో సామూహికంగా 325 దంపతులచే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు ఘనంగా నిర్వహించారు.
భక్తులు వ్రతాలను ఆచరించుకుని అలయంలో వేంచేసియున్న శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు .
ఈ కార్యక్రమంలో, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ డా.దాసరి శ్రీనివాసులు IAS (R) , ప్రాంతీయ సమన్వయకర్త డా. జి ఆర్ కే ప్రసాద్ ( రాంబాబు ) , హెచ్ డి పి టి సభ్యులు ఆధ్యాత్మికవేత్త శ్రీ ఎం వి రాజశేఖర్ , పి జగన్ మోహనరావు , ఎమ్ కె వి వి సత్యనారాయణ , ఆలయ చైర్మన్ శ్రీ ప్రసాద్ , ధర్మకర్తల మండలి సభ్యులు , హెచ్ డి పి టి అనకాపల్లి జిల్లా సభ్యులు , ఎఎస్ఆర్ జిల్లా సభ్యులు , నర్సీపట్నం సభ్యులు , అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు .
చివర్లో భక్తులందరికీ ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది.
K.V.SHARMA EDITOR





Comments
Post a Comment