విశాఖపట్నం, ఆగస్టు 14: నగరంలోని ఎం.వి.పి. కాలనీలో గల గాయత్రీ విద్యా పరిషత్ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ (అటానమస్)లో కంప్యూటర్ సైన్స్ విభాగం మరియు ఐసిటి అకాడమీ (ICT Academy) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఐదు రోజుల జాతీయ స్థాయి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (FDP) శుక్రవారం విజయవంతంగా ముగిసింది. ‘డేటా అనలిటిక్స్ యూజింగ్ పైథాన్’ (Data Analytics Using Python) అనే అంశంపై ఈ నెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
కంప్యూటర్ సైన్స్ అధ్యాపకురాలు కుమారి లయ ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. కంప్యూటర్ సైన్స్ అధ్యాపకురాలు శ్రీమతి వై.ఎస్. విజయలక్ష్మి అతిథులకు వేదికపైకి సాదర స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల డైరెక్టర్ శ్రీ డి. గిరిధర్ మాట్లాడుతూ, “నేటి డిజిటల్ యుగంలో డేటా అనలిటిక్స్ పాత్ర అత్యంత కీలకమైనది. అధ్యాపకులు నిరంతరం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభ్యసిస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి” అని సూచించారు. ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు బోధనా ప్రమాణాలను మరింత పెంపొందించడానికి దోహదపడతాయని పేర్కొంటూ, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి శ్రీ కృష్ణ కుమార్, శ్రీమతి వై.ఎస్. విజయలక్ష్మి, నిర్వాహక బృందం మరియు శిక్షణలో పాల్గొన్న అధ్యాపకులను ఆయన అభినందించారు.
తదనంతరం, శిక్షణా కార్యక్రమానికి ట్రైనర్గా వ్యవహరించిన శ్రీ రాకేష్ పువ్వాడిని కంప్యూటర్ సైన్స్ విభాగం అధ్యాపకురాలు కుమారి వసంత పరిచయం చేశారు.
ఐదు రోజుల పాటు సాగిన ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రముఖ టెక్నికల్ ట్రైనర్ శ్రీ రాకేష్ పువ్వాడి మాట్లాడుతూ, పైథాన్ ద్వారా డేటా అనలిటిక్స్, డేటా మోడలింగ్, డేటా ప్రాసెసింగ్ తదితర అంశాలపై అధ్యాపకులకు ఆచరణాత్మక అవగాహన కల్పించడం ప్రస్తుత సాంకేతిక యుగంలో ఎంతో అవసరమని తెలిపారు. శిక్షణలో భాగంగా డేటాను విశ్లేషించడం, ప్రాసెస్ చేయడం, మోడలింగ్ చేయడం వంటి అంశాలను ప్రాక్టికల్గా వివరించారు.
ఈ కార్యక్రమంలో గాయత్రీ విద్యా పరిషత్ కళాశాల అధ్యాపకులతో పాటు ఆదర్శ్ డిగ్రీ కాలేజ్, అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్, దాడి ఇన్స్టిట్యూట్, డాక్టర్ ఎల్.బి. కాలేజ్, NSRIT ఇంజినీరింగ్ కాలేజ్, శ్రీపాద కాలేజ్ తదితర విద్యాసంస్థలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కంప్యూటర్ అధ్యాపకులు శ్రీ శంకర్ శాస్త్రి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
కంప్యూటర్ సైన్స్ అధ్యాపకురాలు శ్రీమతి మాధురి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది




Comments
Post a Comment