విశాఖపట్నం :విశాఖ సందేశం వార్తా వాహిని :80 వ,స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయం లోని జాతీయ సేవా పథకం సెమినార్ హాల్లో విద్యార్థి సంక్షేమ వ్యవహారాలు మరియు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో గురువారం స్వాతంత్ర సమరయోధుల వేషధారణ పోటీలను నిర్వహించడం జరిగింది.
ప్రారంభ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థి సంక్షేమ వ్యవహారాల డీన్ ఆచార్య ఎస్.హరినాథ్ మాట్లాడుతూ- ఇటువంటి పోటీల వల్ల విద్యార్థులలో దేశభక్తి, సృజనాత్మక శక్తి పెరుగుతాయని అన్నారు. సమావేశంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ శ్రీ డి. సింహాచలం, విద్యార్థి వ్యవహారాల అసిస్టెంట్ డీన్ డాక్టర్ మేరీ సౌజన్య ప్రసంగించారు. పోటీలకు జడ్జిలుగా డాక్టర్ విజయవేణి, ఇపీఎస్ భాగ్యలక్ష్మి వ్యవహరించారు. పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ గా, ఝాన్సీ లక్ష్మీబాయి గా, రాణి చెన్నమ్మగా విద్యార్థులు ప్రదర్శించిన హావభావాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో విద్యార్థులు, జాతీయ సేవా పథకం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


Comments
Post a Comment