Skip to main content

మందకొడిగా ఇంటింటి ప్రచారం: గంటా అసంతృప్తి*

.              K.V.SHARMA  EDITOR 
విశాఖపట్నం, ఆగస్టు 7:_ నియోజకవర్గంలో "ఇంటింటికి తెలుగుదేశం" మందకొడిగా జరగడం పట్ల భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం 12 క్లస్టర్ల నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాల నిర్వహణలో భీమిలికి ప్రత్యేక స్థానముందని, అలాంటిది ఇంటింటి ప్రచారంలో నిరాజనకంగా పని చేస్తున్నారని ఆవేదన చెందారు. గతంలో లక్షకు పైగా సభ్యత్వాలతో రాష్ట్రంలో టాప్ టెన్ లో నిలిచిన నియోజకవర్గం ఈ కార్యక్రమంలో బాగా వెనకబడిందన్నారు. భవిష్యత్ లో నామినేటెడ్ పదవులు, స్థానిక ఎన్నికల్లో ఎంపికకు పార్టీ కార్యక్రమాలే కొలమానంగా పేర్కొన్నారు. గతంలో మాదిరిగా ఇంటింటి ప్రచారంలో కూడా భీమిలి ఎ గ్రేడ్ లో ఉండాలని, ఆ దిశగా అందరూ పని చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 15 నాటికి కనీసం 50 శాతం ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చిక్కాల విజయ్ బాబు, గాడు వెంకటప్పడు, సరగడ అప్పారావు, కసిరెడ్డి దామోదరరావు, మీసాల సత్యనారాయణ, మొల్లి లక్ష్మణరావు, నాగోతి సత్యనారాయణ, మాన్యాల సోంబాబు, గరే గుర్నాథ్, పిల్లా వెంకట్రావు, గంటా నూకరాజు, గాడు చిన్ని కుమారి లక్ష్మి, పీవీ నరసింహం, జానకిరాం, పంచదార్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...