Skip to main content

వెస్క్యులర్ వ్యాధులపై అవగాహన ఎంతో అవసరం........ అత్యాధునిక చికిత్సలతో విజయవంతమైన ఫలితాలు సాధిస్తున్నాం: డా. ఎస్.ఎస్. అమరేంద్రబాబు*.....


విశాఖపట్నం, ఆగస్టు 6: నేటి వరల్డ్ వెస్క్యులర్ డే సందర్భంగా విశాఖ వెంకోజీపాలెం కూడలిలోని మెడికవర్ ఆసుపత్రిలో రక్తనాళాల ఆరోగ్యం, రక్త ప్రసరణ, రక్తనాళాల్లో పూడికలు (బ్లాకేజీలు) వంటి సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వెస్క్యులర్ సర్జన్ డా. ఎస్.ఎస్. అమరేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ రక్తనాళాల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరికీ సరైన అవగాహన ఉండాలని అన్నారు. మెడికవర్ ఆసుపత్రిలో గత ఆరు సంవత్సరాలుగా వెస్క్యులర్ వ్యాధుల నిర్ధారణ, చికిత్సలో విశిష్ట సేవలు అందిస్తున్నామని తెలిపారు. మానవ శరీరంలో తల నుంచి కాలి బొటనవేలు వరకు రక్తప్రసరణ సక్రమంగా ఉండటం అత్యంత కీలకమని, రక్తనాళాల సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని వివరించారు. రక్తనాళాల వ్యాధుల చికిత్సకు అవసరమైన అత్యాధునిక వైద్య సదుపాయాలు మెడికవర్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సూపర్ గ్లూ ఇంజెక్షన్, లేజర్ సాంకేతికతతో నిర్వహిస్తున్న  వేరికోస్‌ వెయిన్స్‌  శస్త్రచికిత్సల్లో 99 శాతం విజయవంతమైన ఫలితాలు సాధిస్తున్నామని డా. అమరేంద్రబాబు పేర్కొన్నారు.

                  K.V.SHARMA EDITOR 

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...