Skip to main content

కన్యాకాపరమేశ్వరి ఆలయంలో శ్రావణమాస పూజలు


విశాఖపట్టణం కురుపాం మార్కెట్ ప్రాంతంలో గల శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం లో శ్రావణమాసం పురస్కరించుకుని ఈనెల13 నుంచి సెప్టెంబర్ 11వ తేది వరకు ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ సంఘ అధ్యక్షులు ఆరిశెట్టిదినకర్, కార్యదర్శి  పెనుగొండ వెంకట కామరాజు ఒక ప్రకటన లో తెలిపారు.

      కన్యకాపరమేశ్వరి అలయం పునర్నిర్మాణంలో వున్నందున నూతనంగా నిర్మించి ప్రతిష్టించిన  బాలాలయంలో శ్రావణమాసంలో వచ్చే ఐదు శుక్రవారాల్లో అమ్మవారికి  ప్రాతఃకాల ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, మహిళలచే సామూహిక లలితాసహశ్రనామ స్తోత్రపారాయణమలు, సామూహిక లక్ష సహశ్ర కుంకుమార్చన పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ఆదివారం నాడు ఆలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ప్రముఖ వర్తకులు శ్రీ బద్రినారాయణ- ఉమామహేశ్వరి   దంపతులు కార్యక్రమ కరపత్రం విడుదల జేశారు.

ఈ సందర్భంగా దేవాలయ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రావణమాసం మొదటి శుక్రవారం 14వ తేది  నాడు అమ్మవారికి రజిత వస్త్రాలంకరణ మరియు 108 స్వర్ణపుష్పార్చన,  మహిళలచే సామూహిక లలితా సహస్రనామ పారాయణం, సామూహిక లక్షకుంకుమార్చన, రెండవ శుక్ర వారం ఆగష్టు 21వ తేది నాడు అమ్మవారికి పట్టువస్త్రాలంకరణ మరియు మహిళలచే సామూహికంగా లలితాసహశ్రనామ పారాయణ, లక్ష కుంకుమార్చన;  మూడవ శుక్రవారం ఆగష్టు 28వ తేది నాడు అమ్మవారికి పుష్పవస్త్రాలంకరణ,  మరియు మహిళలచే సామూహికంగా లలితాసహశ్రనామ పారాయణ,  సామూహిక లక్ష కుంకుమార్చన,  నాల్గవ శుక్రవారం సెప్టెంబర్ 4వ తేది నాడు అమ్మవారికి హరిద్రవస్త్రాలంకరణ,   మహిళలచే సామూహిక పారాయణములు, లక్షకుంకుమార్చన, ఐదవ శుక్రవారం సెప్టెంబర్ 11వ తేది నాడు శ్రీమహాలక్ష్మి దేవికి పసుపునీళ్ళతో అభిషేకం మరియు సెప్టెంబర్ 4వ తేదినాడు భారీ స్ధాయిలో నారాయణ సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.శ్రావణమాసంలో వచ్చే ఐదు శుక్రవారాలలోనూ నిర్వహించే సామూహికకుంకుమ పూజలకు సంబంధించి పూజా సామగ్రి యావత్తూ దేవస్థానంవారు ఉచితంగా ఏ విధమైన రుసుం తీసుకోకుండా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని ఆర్య వైశ్యులు  ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికృపకు పాత్రులు కమ్మని కోరారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...