Vizag, ఆగస్ట్ 5, 2026: ప్రతి సంవత్సరం ఆగస్ట్ మొదటి వారం ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వారంగా జరుపుకుంటారు. ఇందులో భాగంగా మెడికవర్ హాస్పిటల్స్ లో ఆగస్ట్ 1 నుండి 7వ తేదీ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ వారోత్సవాల్లో తల్లిపాలలోని పోషక విలువలు, శిశువు ఆరోగ్య అభివృద్ధిపై దాని ప్రభావం గురించి అవగాహన కల్పించే అనేక కార్యక్రమాలు నిర్వహించారు. నర్సులు, రెసిడెంట్ డాక్టర్ల కోసం క్విజ్ పోటీలు, పోస్టర్ ప్రదర్శనలు, విద్యా కార్యక్రమాలు, బ్రెస్ట్ ఫీడింగ్ సమస్యలపై మినీ వర్క్షాపులు నిర్వహించబడ్డాయి.
డా. సాయి సునీల్ కిషోర్, డా. విజయ్, డా. మౌనికా, డా. ప్రియాంక , సెంటర్ హెడ్ డా. శ్రీకాంత్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి తమ ప్రసంగాలతో తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. డా. సాయి సునీల్ కిషోర్ నియోనాటాలజిస్టు & పీడియాట్రిక్ స్పెషలిస్టు మాట్లాడుతూ, "తల్లిపాలు శిశువుకు మొదటి టీకా లాంటివి. శిశువు ఆరోగ్యానికి, రోగనిరోధకశక్తి పెరుగుదలకు ఇవి మేలైన ఆధారం. ప్రతి తల్లి వీటిని ఇచ్చేందుకు చురుకుగా ఉండాలి" అని అన్నారు. డా. ప్రియాంక మాట్లాడుతూ,"తల్లిపాలు తల్లికి, బిడ్డకు శారీరకంగా, మానసికంగా లాభం కలిగిస్తాయి. ఈ ప్రక్రియ ఒక సహజమైన బంధాన్ని ఏర్పరచుతుంది. ప్రతి తల్లి దీన్ని ప్రోత్సహించాలి" అని అన్నారు.
మెడికవర్ హాస్పిటల్స్ ఈ కార్యక్రమం ద్వారా తల్లుల్లో ఆత్మవిశ్వాసం, అవగాహన పెంచే దిశగా మరొక ముందడుగు వేసింది. వైద్యులు, నర్సింగ్ తల్లులు మరియు ఆసుపత్రి సిబ్బంది ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.
K.V.SHARMA EDITOR

Comments
Post a Comment