సాల్ట్ డిపార్ట్మెంట్ భవనం కూల్చివేతపై ముదురుతున్న వివాదం.... అధికారులపై ఆరోపణల వర్షం.. జిల్లా కలెక్టర్ స్పందించాలని డిమాండ్...
. SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం...అమలాపురంలోని బ్రిటిష్ కాలం నాటి(పాత) సాల్ట్ డిపార్ట్మెంట్ భవనం కూల్చివేత వ్యవహారం రోజురోజుకూ మరింత వివాదాస్పదంగా మారుతోంది. ప్రభుత్వ భవనాన్ని కూల్చివేసే అధికారం ఎక్సైజ్ శాఖకు ఎవరు ఇచ్చారు? ఏ శాఖ అనుమతితో ఈ చర్య చేపట్టారు? అనే ప్రశ్నలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
ప్రభుత్వ ఆస్తుల నిర్వహణకు స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ, భవనం కూల్చివేతకు ముందు సంబంధిత శాఖల అనుమతులు తీసుకున్నారా? టెండర్ ప్రక్రియ నిర్వహించారా? పత్రికా ప్రకటన విడుదల చేశారా? అనే అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చిన్నపాటి ప్రభుత్వ వాహనాల వేలం విషయంలో కూడా అన్ని నిబంధనలు పాటించే అధికారులు, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తి కూల్చివేత విషయంలో ఎందుకు మౌనం వహించారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ అధికారులు భవనం శకలాలు తొలగించేందుకు రూ.35 వేల ఖర్చు చేశామని, కలపను భద్రపరిచామని చెబుతున్నప్పటికీ, ఆ నిధులు ఏ ఖాతా నుంచి విడుదలయ్యాయి? ఆ ఖర్చుకు ఎవరు పరిపాలనా అనుమతి ఇచ్చారు? ప్రభుత్వ భవనంలోని కలపను ఏ అధికారంతో తమ ఆధీనంలో ఉంచారు? అనే ప్రశ్నలకు ఇప్పటివరకు అధికారిక సమాధానం లేదు.
అమలాపురం, విశాఖ సందేసం...అమలాపురంలోని బ్రిటిష్ కాలం నాటి(పాత) సాల్ట్ డిపార్ట్మెంట్ భవనం కూల్చివేత వ్యవహారం రోజురోజుకూ మరింత వివాదాస్పదంగా మారుతోంది. ప్రభుత్వ భవనాన్ని కూల్చివేసే అధికారం ఎక్సైజ్ శాఖకు ఎవరు ఇచ్చారు? ఏ శాఖ అనుమతితో ఈ చర్య చేపట్టారు? అనే ప్రశ్నలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
ప్రభుత్వ ఆస్తుల నిర్వహణకు స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ, భవనం కూల్చివేతకు ముందు సంబంధిత శాఖల అనుమతులు తీసుకున్నారా? టెండర్ ప్రక్రియ నిర్వహించారా? పత్రికా ప్రకటన విడుదల చేశారా? అనే అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చిన్నపాటి ప్రభుత్వ వాహనాల వేలం విషయంలో కూడా అన్ని నిబంధనలు పాటించే అధికారులు, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తి కూల్చివేత విషయంలో ఎందుకు మౌనం వహించారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ అధికారులు భవనం శకలాలు తొలగించేందుకు రూ.35 వేల ఖర్చు చేశామని, కలపను భద్రపరిచామని చెబుతున్నప్పటికీ, ఆ నిధులు ఏ ఖాతా నుంచి విడుదలయ్యాయి? ఆ ఖర్చుకు ఎవరు పరిపాలనా అనుమతి ఇచ్చారు? ప్రభుత్వ భవనంలోని కలపను ఏ అధికారంతో తమ ఆధీనంలో ఉంచారు? అనే ప్రశ్నలకు ఇప్పటివరకు అధికారిక సమాధానం లేదు.
భవనం కూల్చివేతకు సంబంధించిన పూర్తి ఫైల్, అనుమతులు, ఖర్చుల వివరాలు, కలప నిల్వ వివరాలు, సంబంధిత అధికారుల బాధ్యతలపై జిల్లా యంత్రాంగం వెంటనే ప్రజలకు స్పష్టత ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ స్వయంగా జోక్యం చేసుకుని సమగ్ర విచారణకు ఆదేశాలు ఇవ్వాలని, వాస్తవాలను బహిర్గతం చేసి ప్రజల్లో నెలకొన్న అనుమానాలకు ముగింపు పలకాలని స్థానికులు గట్టిగా కోరుతున్నారు


Comments
Post a Comment