Skip to main content

సాల్ట్ డిపార్ట్‌మెంట్ భవనం కూల్చివేతపై ముదురుతున్న వివాదం.... అధికారులపై ఆరోపణల వర్షం.. జిల్లా కలెక్టర్ స్పందించాలని డిమాండ్...

.          SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం...అమలాపురంలోని బ్రిటిష్ కాలం నాటి(పాత) సాల్ట్ డిపార్ట్‌మెంట్ భవనం కూల్చివేత వ్యవహారం రోజురోజుకూ మరింత వివాదాస్పదంగా మారుతోంది. ప్రభుత్వ భవనాన్ని కూల్చివేసే అధికారం ఎక్సైజ్ శాఖకు ఎవరు ఇచ్చారు? ఏ శాఖ అనుమతితో ఈ చర్య చేపట్టారు? అనే ప్రశ్నలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.


ప్రభుత్వ ఆస్తుల నిర్వహణకు స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ, భవనం కూల్చివేతకు ముందు సంబంధిత శాఖల అనుమతులు తీసుకున్నారా? టెండర్ ప్రక్రియ నిర్వహించారా? పత్రికా ప్రకటన విడుదల చేశారా? అనే అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చిన్నపాటి ప్రభుత్వ వాహనాల వేలం విషయంలో కూడా అన్ని నిబంధనలు పాటించే అధికారులు, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తి కూల్చివేత విషయంలో ఎందుకు మౌనం వహించారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ అధికారులు భవనం శకలాలు తొలగించేందుకు రూ.35 వేల ఖర్చు చేశామని, కలపను భద్రపరిచామని చెబుతున్నప్పటికీ, ఆ నిధులు ఏ ఖాతా నుంచి విడుదలయ్యాయి? ఆ ఖర్చుకు ఎవరు పరిపాలనా అనుమతి ఇచ్చారు? ప్రభుత్వ భవనంలోని కలపను ఏ అధికారంతో తమ ఆధీనంలో ఉంచారు? అనే ప్రశ్నలకు ఇప్పటివరకు అధికారిక సమాధానం లేదు.

భవనం కూల్చివేతకు సంబంధించిన పూర్తి ఫైల్, అనుమతులు, ఖర్చుల వివరాలు, కలప నిల్వ వివరాలు, సంబంధిత అధికారుల బాధ్యతలపై జిల్లా యంత్రాంగం వెంటనే ప్రజలకు స్పష్టత ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ స్వయంగా జోక్యం చేసుకుని సమగ్ర విచారణకు ఆదేశాలు ఇవ్వాలని, వాస్తవాలను బహిర్గతం చేసి ప్రజల్లో నెలకొన్న అనుమానాలకు ముగింపు పలకాలని స్థానికులు గట్టిగా కోరుతున్నారు

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...