Skip to main content

*సాక్షి బృందంపై దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం – జిల్లా పార్టీ అధ్యక్షులు కెకె రాజు*


 ఎలమంచిలి నియోజకవర్గంలో కూటమి  నాయకులు చేస్తున్న అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సాక్షి మీడియా బృందాన్ని కూటమి నాయకులు అడ్డుకోవడం అత్యంత దురదృష్టకరమని జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కెకె రాజు తీవ్రంగా ఖండించారు.*

అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించడానికి వీల్లేదంటూ సాక్షి బృందాన్ని అడ్డుకోవడమే కాకుండా, అక్కడి పరిస్థితులను వీడియో చిత్రీకరిస్తే అక్రమ కేసులు నమోదు చేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. బెదిరింపులకు లొంగకుండా తమ విధి నిర్వహణలో భాగంగా నిజాలను నమోదు చేయడానికి ప్రయత్నించిన సాక్షి బృందాన్ని అడ్డుకోవడం, వారిపై ఒత్తిడి తీసుకురావడం, అక్రమ కేసులు పెడతామని హెచ్చరించడం ఏమాత్రం సమర్థనీయం కాదని కెకె రాజు అన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియాకు స్వేచ్ఛగా వార్తలను సేకరించి ప్రజలకు చేరవేసే హక్కు ఉందని, మీడియాపై దాడులు, బెదిరింపులు, అడ్డంకులు సృష్టించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి, సాక్షి బృందాన్ని అడ్డుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అక్రమ మైనింగ్ ఆరోపణలపై సమగ్ర విచారణ నిర్వహించి నిజాలను ప్రజల ముందుంచాలని జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కెకె రాజు డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...