Skip to main content

కర్బన ఉద్గారాల తగ్గింపుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు ఏంటి* *- పార్లమెంటులో తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్న

 


న్యూఢిల్లీ, ఆగస్టు 6: దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించి పరిశ్రమలను పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో రూ.20 వేల కోట్ల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేసేందుకు తెలిపింది. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో తిరుపతి ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, 2026-27 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఈ కార్యక్రమం ద్వారా విద్యుత్, ఉక్కు, సిమెంట్, రిఫైనరీలు, రసాయన పరిశ్రమలు వంటి అధిక కర్బన ఉద్గారాలు వెలువరించే ఐదు ప్రధాన రంగాల్లో కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం రూపకల్పన దశలో ఉందని, దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత అమలుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను రూపొందిస్తామని పేర్కొన్నారు. 

ఈ మార్గదర్శకాల్లో ప్రాజెక్టుల ఎంపిక ప్రమాణాలు, మానిటరింగ్, రిపోర్టింగ్, వెరిఫికేషన్ విధానం, స్వతంత్ర ఆడిట్ నిబంధనలు, ప్రజలకు సమాచారం వెల్లడించే విధానం, కర్బన ఉద్గారాల తగ్గింపును అంచనా వేసే పద్ధతులు వంటి అంశాలను రూపొందించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. కర్బన ఉద్గారాల తగ్గింపును శాస్త్రీయంగా అంచనా వేసే వ్యవస్థలు తప్పనిసరిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యుత్, ఉక్కు, సిమెంట్, రిఫైనరీలు, రసాయన పరిశ్రమలు వంటి అధిక కర్బన ఉద్గారాలు వెలువరించే రంగాల్లో ఈ సాంకేతికతను సమర్థవంతంగా అమలు చేస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు దేశం నెట్-జీరో లక్ష్యాల సాధనకు దోహదపడుతుందని ఆయన అన్నారు

                   K.V.SHARMA EDITOR 

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...