Skip to main content

శాసన సభ సమావేశాలను వీక్షించిన ఏయూ విద్యార్థులు

 

                   K.V.SHARMA EDITOR 
ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆగష్టు 19 : ఆంధ్ర విశ్వవిద్యాలయం, రాజనీతి శాస్త్ర మరియు పరిపాలన విభాగం విద్యార్థులు విభాగాధిపతి ఆచార్య పేటేటి. ప్రేమానందం ఆధ్వర్యంలో ఇటీవల గౌరవ శాసనసభ స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు  పిలుపుమేరకు నేడు అసెంబ్లీ సమావేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆచార్య పేటేటి. ప్రేమానందం మాట్లాడుతూ సాధారణంగా రాజనీతి శాస్త్రము మరియు పరిపాలనా శాస్త్రంలో రాష్ట్ర రాజకీయాలు మరియు శాసనసభలు అనే అంశాన్ని పాఠాలుగా బోధిస్తూ ఉంటాంమ‌ని, ఆ పాఠాలనే నేడు  విద్యార్థిని విద్యార్థులకు  అనుభవ పూర్వక విజ్ఞానాన్ని  అందజేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు.  ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసి ఆచార్య జి.పి. రాజశేఖర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, రెక్టార్ పులిపాటి కింగ్ మరియు ఆర్ట్స్ కళాశాల  ప్రిన్సిపల్ ఆచార్య జాలాద రవి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం అయ్యిందని అన్నారు.

ఈ కార్యక్రమం సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు సుమారు 35 నిమిషాల పాటు శాసనసభ సమావేశాలను వీక్షించి,  ఒక కొత్త అనుభూతిని పొందారు. ఈ కార్యక్రమంలో భాగంగా విభాగాధిపతి పేటేటి ప్రేమానందం  గౌరవ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారిని సన్మానించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ (విశాఖ దక్షిణనియోజకవర్గం ఎమ్మెల్యే) మరియు సోము వీర్రాజు లు  విద్యార్థుల‌కు ఉపయుక్తంగా  ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేసారని ఆచార్య ప్రేమానందం తెలిపారు.

ఈ కార్యక్రమంలో విభాగం సహాయక ఆచార్యులు డాక్ట‌ర్‌ కె.సత్యన్నారాయణ, విభాగ అధ్యాపకులు డాక్టర్ టి నాగరాజు, డాక్టర్ జి.ప్రియాంక మరియు 30 మంది విద్యార్థుని విద్యార్థులు పాల్గొన్నారు.

 

ఆచార్య  పేటేటి ప్రేమానందం 

విభాగాధిపతి

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...