Skip to main content

చేనేత కార్మికులకు అండగా ఉంటాం: బిజెపి విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామ రాజు

.             D.S.Varma Sr Sub EDITOR 
విశాఖపట్నం: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విశాఖలోని ఎన్.ఎ.డి (NAD) ప్రాంతంలో ఉన్న చేనేత కుటుంబాలను బిజెపి జిల్లా అధ్యక్షుడు పరశురామ రాజు నేరుగా సందర్శించారు. కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారు స్వయంగా తయారుచేస్తున్న వైవిధ్యభరితమైన వస్త్రాలను, వారి అద్భుతమైన చేనేత నైపుణ్యాన్ని స్వయంగా పరిశీలించి, వారి ప్రతిభను అభినందించారు.


​ఈ సందర్భంగా పరశురామ రాజు  మాట్లాడుతూ, మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే చేనేత కళను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. చేనేత రంగాభివృద్ధికి మరియు నేతన్నల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను కార్మికులకు సమగ్రంగా వివరించారు. అనంతరం చేనేత కార్మికులను శాలువాలతో ఘనంగా సత్కరించి గౌరవించారు.


చేనేత రంగానికి, నేతన్నలకు ప్రత్యక్షంగా అండగా నిలిచేందుకు ప్రతీ బిజెపి నాయకుడు, కార్యకర్త వారంలో కనీసం ఒకరోజు తప్పనిసరిగా చేనేత వస్త్రాలను ధరించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి డాడీ రమేష్,జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ రాకేష్,సీనియర్ నాయకులు కొప్పల రామ్ కుమార్, వలిరెడ్డి శ్రీనివాస్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...