Skip to main content

గాయత్రి విద్యా పరిషత్ కళాశాలలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’పై అవగాహనా కార్యక్రమం

.    Dr Nanduri Ramakrishna Sr Sub EDITOR 
విశాఖపట్నం :విశాఖ సందేశం వర్తవాహని :ఆగస్టు 12, 2026: గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ (అటానమస్), ఎమ్.వి.పి. శాఖ లో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (ఫీల్డ్ ఆఫీస్–విశాఖపట్నం) ఆధ్వర్యంలో, కళాశాల సహకారంతో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా సమగ్ర సమాచార, అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.


ఈ సందర్భంగా కళాశాల యూజీ కోర్సుల డైరెక్టర్ శ్రీ డి. గిరిధర్ మాట్లాడుతూ, విద్యార్థి దశలో మంచి అలవాట్లు, సానుకూల ఆలోచనా విధానం, క్రమశిక్షణ ఎంతో అవసరమని అన్నారు. యువత తమ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించి, విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాల ద్వారా తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.


కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ బి. రుత్విక్, IRS, ఆదాయపు పన్నుల శాఖ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అన్నారు. మాదకద్రవ్యాలకు బానిసైన వ్యక్తి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, కుటుంబ సంబంధాలు, సామాజిక జీవితం వంటి అనేక రంగాల్లో నష్టపోతారని వివరించారు.


కళాశాలపీఆర్వోశ్రీమతిశేషపద్మమాట్లాడుతూమాదకద్రవ్యాల ప్రభావానికి లోనుకాకుండా యువత అప్రమత్తంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగాన్ని నిరోధించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. 


ప్రత్యేక ఆహ్వానితులుగా III టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ  భావ్య పాల్గొని, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే సామాజిక, చట్టపరమైన పరిణామాలను వివరించారు.


సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీ కందాల శ్రీరామమూర్తి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ లక్ష్యాలను విద్యార్థులకు వివరించారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో విస్తృత అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా కుటుంబ వ్యవస్థను, సామాజిక విలువలను ప్రభావితం చేస్తుందని అన్నారు. యువత  మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి మార్గదర్శకులుగా నిలవాలని పిలుపునిచ్చారు.


.అనంతరం విద్యార్థులతో ‘నషా ముక్త్ భారత్’ ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ డి. దక్షిణామూర్తి, కళాశాల డైరెక్టర్ శ్రీ డి. గిరిధర్, పీఆర్వో శ్రీమతి శేష పద్మలను, ముఖ్య అతిథి శ్రీ బి. రుత్విక్, IRS మరియు III టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌.ఐ  భావ్య లను ఘనంగా సత్కరించారు.


ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొని విజేతలగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను వివరిస్తూ నవరస థియేటర్ ఆర్ట్ అసోసియేషన్ కళాకారులు ప్రదర్శించిన డ్రగ్ అవేర్‌నెస్ స్కిట్ విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది.


ఈ కార్యక్రమంలో హిందీ విభాగానికి చెందిన డా. అనిత, మైక్రోబయాలజీ విభాగానికి చెందిన డా. శ్యామల, ఆంగ్ల విభాగాధిపతి డా. విజయలక్ష్మి, శ్రీ కె. కృష్ణ కుమార్ తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...