Skip to main content

జార్ఖండ్‌లో విద్యార్థులపై పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నాం…. రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరిని ప్రశ్నించిన మాధవ్ .. - ఏపీ బీజేపీ చీఫ్ పీవీయన్ మాధవ్

.                  K.V.SHARMA EDITOR 
విశాఖపట్నం: విశాఖ సందేశం వర్తవాహని: జార్ఖండ్ రాజధాని రాంచీలో తమ ఉపాధి,ఉద్యోగాలు, భవిష్యత్తు, హక్కుల కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ  రాష్ట్ర అధ్యక్షులు  పీవీఎన్ మాధవ్ తీవ్రంగా ఖండించారు . 

విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో పీవీయన్ మాధవ్ మాట్లాడుతూ..విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన కాంగ్రెస్–జేఎంఎం ప్రభుత్వం అందుకు బదులుగా వారిపై లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం, వాటర్ క్యానన్లు ఉపయోగించడం, బారికేడ్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో తమ హక్కుల కోసం నిరసన చేస్తున్న విద్యార్థులను అణచివేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పీవీఎన్ మాధవ్ అన్నారు. విద్యార్థులు తమ సమస్యలపై ప్రశ్నిస్తే వారిని శత్రువులుగా చూడటం కాంగ్రెస్–జేఎంఎం ప్రభుత్వ అసహన వైఖరికి నిదర్శనమన్నారు. మహిళా విద్యార్థుల పట్ల కూడా అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని మాధవ్ డిమాండ్ చేశారు.

విద్యార్థుల సమస్యలపై దేశవ్యాప్తంగా మాట్లాడే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి జార్ఖండ్ విద్యార్థుల ఆవేదన ఎందుకు కనిపించడం లేదని పీవీఎన్ మాధవ్ సూటిగా ప్రశ్నించారు. ఢిల్లీలో జరిగే ప్రతి నిరసనపై స్పందించే రాహుల్ గాంధీ, కాంగ్రెస్–జేఎంఎం ప్రభుత్వం అధికారంలో ఉన్న జార్ఖండ్‌లో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యపై ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు.

విద్యార్థుల భవిష్యత్తు కంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పోలీసులు విద్యార్థులపై చర్యలు తీసుకుంటే ఒక విధంగా, ఇతర రాష్ట్రాల్లో జరిగితే మరో విధంగా స్పందించడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి కాదా అని అన్నారు. విద్యార్థులకు మద్దతు ఇవ్వడంలో కూడా ‘పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియెన్స్’ ఎందుకు పాటిస్తున్నారని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ నిజంగా విద్యార్థుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఉంటే జార్ఖండ్‌కు వెళ్లి విద్యార్థులను పరామర్శించి, వారి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని పీవీఎన్ మాధవ్ అన్నారు.

గత కొద్ది రోజులుగా పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సమయంలో గందరగోళం సృష్టించడమే కాంగ్రెస్ పార్టీ వైఖరిగా మారిందని పీవీఎన్ మాధవ్ విమర్శించారు. మొదట ఒక డిమాండ్, ఆ తర్వాత మరో డిమాండ్, ఇప్పుడు ఇంకో అంశాన్ని తెరపైకి తీసుకురావడం చూస్తుంటే రాహుల్ గాంధీ ప్రతిరోజూ తన ‘గోల్‌పోస్ట్’ ఎందుకు మారుస్తున్నారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ సభను సజావుగా నడవనివ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి సభలో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రులు స్పష్టం చేస్తున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ చర్చ నుంచి ఎందుకు వెనక్కి వెళ్తోందని నిలదీశారు.

“చర్చకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వం.. చర్చకు సిద్ధంగా లేని ప్రతిపక్షం” అన్న పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోందని పీవీఎన్ మాధవ్ విమర్శించారు. పార్లమెంట్ ప్రజా సమస్యలపై చర్చించాల్సిన వేదిక అని, రాజకీయ గందరగోళానికి వేదిక కాదని అన్నారు.

ఆగస్టు 10న నిర్వహించిన విలేకరుల సమావేశంలో జంతర్ మంతర్ ఘటనకు సంబంధించి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై వాస్తవాలను దేశ ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందని పీవీఎన్ మాధవ్ అన్నారు. జంతర్ మంతర్ వద్ద బుల్లెట్లు పేల్చినట్లు చేసిన ఆరోపణలకు ఆధారాలు ఏమిటో రాహుల్ గాంధీ దేశ ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

రాజకీయ లబ్ధి కోసం నిర్ధారణ లేని ఆరోపణలు చేయడం, వాటి ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టించడం బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడి లక్షణం కాదని అన్నారు. “రాహుల్ గాంధీ గారూ.. ఆరోపణలు చేయడం కాదు.. ఆధారాలు చూపించండి” అని పీవీఎన్ మాధవ్ సవాల్ చేశారు.

రాహుల్ గాంధీ పారిపోవద్దని, చర్చకు భయపడవద్దని పీవీఎన్ మాధవ్ అన్నారు. కేంద్ర హోంమంత్రి పార్లమెంట్‌లో సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, కాబట్టి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌ను సజావుగా నడవనివ్వాలని కోరారు.

చర్చ జరగాలని, వాస్తవాలు దేశ ప్రజల ముందుకు రావాలని అన్నారు. రాహుల్ గాంధీ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని పార్లమెంట్‌లో పెట్టాలని, వాటిపై ప్రభుత్వం సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు.

బీజేపీ డిమాండ్ల

జార్ఖండ్‌లో విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరపాలని పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. విద్యార్థులపై అనవసరంగా కేసులు నమోదు చేసి ఉంటే వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లపై కాంగ్రెస్–జేఎంఎం ప్రభుత్వం వెంటనే చర్చించి పరిష్కారం చూపాలని కోరారు.

విద్యార్థులపై అధిక బలప్రయోగానికి బాధ్యులైన అధికారులపై విచారణ జరిపి, తప్పు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా విద్యార్థులు చేసిన ఆరోపణలపై ప్రత్యేకంగా విచారణ జరిపి, వాస్తవాలను ప్రజల ముందుంచాలని అన్నారు.

భారతీయ జనతా పార్టీ జార్ఖండ్ విద్యార్థులు, యువతకు అండగా నిలుస్తుందని పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. యువత భవిష్యత్తు రాజకీయాలకు బలికావడానికి వీల్లేదని అన్నారు. విద్యార్థుల హక్కులు, ఉద్యోగాలు, భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడే ప్రతి విద్యార్థికి బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ తన ద్వంద్వ వైఖరిని విడనాడి విద్యార్థుల సమస్యలను రాజకీయ కోణంలో చూడకుండా పరిష్కరించేందుకు ముందుకు రావాలని పీవీఎన్ మాధవ్ కోరారు .

“రాహుల్ గాంధీ గారూ.. పారిపోవద్దు.. చర్చకు భయపడవద్దు.. పార్లమెంట్‌ను పనిచేయనివ్వండి.. దేశానికి సమాధానం చెప్పండి” అని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు.


Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...