రామాలయం వీధిలో వినాయక చవితి పండుగ నిర్వహించుకునేందుకు అనేక అడ్డంకులు కల్పిస్తున్నామని అవాస్తవాలు మాట్లాడటం సబబు కాదు అని జీవీఎంసీ 27 వ వార్డు టీడీపీ అధ్యక్షుడు,శ్రీ ఎరుకమాంబ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి సత్యనారాయణరెడ్డి తెలిపారు.వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్ గోలగాని వీరరావు (బుజ్జి) ఇతర వార్డు నాయకులతో కలిసి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రామాలయం వీధిలో స్థానిక వైసీపీ నాయకుడు సర్వేశ్వర రెడ్డి ఎంతోకాలంగా తాము పెట్టిన ఫ్లెక్సీలపై అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో బురదజల్లుతున్నారని ఆరోపించారు.రామాలయం వీధిలో ప్రతీ ఏటా నిర్వహించే వినాయకచవితి వేడుకలకు తాము ఎటువంటి అవరోధాలు కల్పించలేదని తెలిపారు. వినాయకుని విగ్రహం ఏర్పాటుచేసే సమయానికి తమ ఫ్లెక్సీలు తొలగిస్తామని చెప్పినా సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని సత్యనారాయణ రెడ్డి మండిపడ్డారు.వార్డుప్రజలు ఎన్నిసార్లు తిరస్కరించినా వినాయకుని మండపం పేరుతో రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.హిందువులు భక్తిశ్రద్దలతో జరుపుకునే వినాయక చవితికి తాము అడ్డుపడుతున్నామని సోషల్ మీడియాలో అబద్దాలతో ప్రచారంచేస్తున్నారన్నారు. వార్డులో సదరువ్యక్తి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించినా తాము ఇప్పటివరకు అడ్డుపడలేదన్నారు. అలాగే వార్డులో పదిరోజులు మంచినీరు సరఫరా కాలేదని కూడా అవాస్తవాన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని గుర్తుచేశారు.తమ సహనాన్ని పరీక్షించవద్దని అధికారంలో ఉన్నప్పుడే తమను ఏమీ చెయ్యలేకపోయారనేది గుర్తుతెచ్చుకోవాలన్నారు. తనను ధర్మకర్తగా ధర్మాన్ని రక్షించాలని నీతో నీతులు చెప్పించుకునే స్థితిలో తాను లేనని నేను 1998వ సంవత్సరంలోనే ధర్మకర్తల మండలి చైర్మన్ గా పని చేశానని అప్పటికి నువ్వు రాజకీయాల్లో ఓనమాలు కూడా దిద్దలేదంటూ ఎద్దేవా చేశారు.తనతో రాజకీయంగా ఏదైనా వుంటే ధైర్యంగా ఎదుర్కొనాలని తన కుటుంబ సభ్యులు గురించి అవాకులు, చవాకులు మాట్లాడితే తాను నోరు విప్పి మాట్లాడితే రేపటి నీ రాజకీయ భవిష్యత్తు శూన్యమవుతుందని సర్వేశ్వర రెడ్డిని హెచ్చరించారు. ఈ సమావేశంలో 27వ వార్డ్ టీడీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ శివప్రసాద్, శ్రీ ఎరుకమాంబ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తలు కెవిఎస్ గురు గోవింద్, మచ్చా కనకారావు, బసనబోయిన సుజాత, కుప్పిలి కుంతీదేవి, టేకుపూడి మంగాదేవి, గనివాడ లక్ష్మీ, శ్రీ రామ మందిరం మరియు పరదేశమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తలు బెహరా ఆశిష్, అలమండ సత్యవతి, అల్లూరి రమాదేవి, వార్డు నాయకులు గురునాథ రావు, సుగుణ, అచ్చియమ్మ, కనకమహాలక్ష్మి, మజ్జి వెంకట సత్యనారాయణ, గొరుసు గురునాథ్ రెడ్డి, అల్లూరి నాగేంద్ర రెడ్డి, అల్లూరి రామచంద్ర రెడ్డి, నవీన్, ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు.
రామాలయం వీధిలో వినాయక చవితి పండుగ నిర్వహించుకునేందుకు అనేక అడ్డంకులు కల్పిస్తున్నామని అవాస్తవాలు మాట్లాడటం సబబు కాదు అని జీవీఎంసీ 27 వ వార్డు టీడీపీ అధ్యక్షుడు,శ్రీ ఎరుకమాంబ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి సత్యనారాయణరెడ్డి తెలిపారు.వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్ గోలగాని వీరరావు (బుజ్జి) ఇతర వార్డు నాయకులతో కలిసి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రామాలయం వీధిలో స్థానిక వైసీపీ నాయకుడు సర్వేశ్వర రెడ్డి ఎంతోకాలంగా తాము పెట్టిన ఫ్లెక్సీలపై అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో బురదజల్లుతున్నారని ఆరోపించారు.రామాలయం వీధిలో ప్రతీ ఏటా నిర్వహించే వినాయకచవితి వేడుకలకు తాము ఎటువంటి అవరోధాలు కల్పించలేదని తెలిపారు. వినాయకుని విగ్రహం ఏర్పాటుచేసే సమయానికి తమ ఫ్లెక్సీలు తొలగిస్తామని చెప్పినా సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని సత్యనారాయణ రెడ్డి మండిపడ్డారు.వార్డుప్రజలు ఎన్నిసార్లు తిరస్కరించినా వినాయకుని మండపం పేరుతో రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.హిందువులు భక్తిశ్రద్దలతో జరుపుకునే వినాయక చవితికి తాము అడ్డుపడుతున్నామని సోషల్ మీడియాలో అబద్దాలతో ప్రచారంచేస్తున్నారన్నారు. వార్డులో సదరువ్యక్తి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించినా తాము ఇప్పటివరకు అడ్డుపడలేదన్నారు. అలాగే వార్డులో పదిరోజులు మంచినీరు సరఫరా కాలేదని కూడా అవాస్తవాన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని గుర్తుచేశారు.తమ సహనాన్ని పరీక్షించవద్దని అధికారంలో ఉన్నప్పుడే తమను ఏమీ చెయ్యలేకపోయారనేది గుర్తుతెచ్చుకోవాలన్నారు. తనను ధర్మకర్తగా ధర్మాన్ని రక్షించాలని నీతో నీతులు చెప్పించుకునే స్థితిలో తాను లేనని నేను 1998వ సంవత్సరంలోనే ధర్మకర్తల మండలి చైర్మన్ గా పని చేశానని అప్పటికి నువ్వు రాజకీయాల్లో ఓనమాలు కూడా దిద్దలేదంటూ ఎద్దేవా చేశారు.తనతో రాజకీయంగా ఏదైనా వుంటే ధైర్యంగా ఎదుర్కొనాలని తన కుటుంబ సభ్యులు గురించి అవాకులు, చవాకులు మాట్లాడితే తాను నోరు విప్పి మాట్లాడితే రేపటి నీ రాజకీయ భవిష్యత్తు శూన్యమవుతుందని సర్వేశ్వర రెడ్డిని హెచ్చరించారు. ఈ సమావేశంలో 27వ వార్డ్ టీడీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ శివప్రసాద్, శ్రీ ఎరుకమాంబ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తలు కెవిఎస్ గురు గోవింద్, మచ్చా కనకారావు, బసనబోయిన సుజాత, కుప్పిలి కుంతీదేవి, టేకుపూడి మంగాదేవి, గనివాడ లక్ష్మీ, శ్రీ రామ మందిరం మరియు పరదేశమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తలు బెహరా ఆశిష్, అలమండ సత్యవతి, అల్లూరి రమాదేవి, వార్డు నాయకులు గురునాథ రావు, సుగుణ, అచ్చియమ్మ, కనకమహాలక్ష్మి, మజ్జి వెంకట సత్యనారాయణ, గొరుసు గురునాథ్ రెడ్డి, అల్లూరి నాగేంద్ర రెడ్డి, అల్లూరి రామచంద్ర రెడ్డి, నవీన్, ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Comments
Post a Comment