ఘనంగా బాజపా రాష్ట్ర రధసారధి పివిఎన్ మాధవ్ జన్మదిన వేడుకలు* *గాజువాకలో పలు సేవా కార్యక్రమాలు నిర్వ హించిన బాజపా శ్రేణులు*
. డి.ఎస్. వర్మ, సీనియర్ సబ్-ఎడిటర్
విశాఖపట్నం: విశాఖ సందేశం వార్తా వాహిని :బిజేపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం గాజువాక కన్వీనర్ మరియు రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు (KNR) ఆధ్వర్యంలో పలువురు నాయకులతో కలిసి మాధవ్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి గజమాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సారధ్యం ,అటల్ మోదీ సుపరిపాలన యాత్ర,జనతా వారధి, మన ఊరు మన జెండా వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. పార్టీ జెండా ప్రతి వీదిలో ఎగిరే విధంగా కార్యకర్తలను తయారు చేసారని అన్నారు
విశాఖపట్నం: విశాఖ సందేశం వార్తా వాహిని :బిజేపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం గాజువాక కన్వీనర్ మరియు రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు (KNR) ఆధ్వర్యంలో పలువురు నాయకులతో కలిసి మాధవ్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి గజమాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సారధ్యం ,అటల్ మోదీ సుపరిపాలన యాత్ర,జనతా వారధి, మన ఊరు మన జెండా వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. పార్టీ జెండా ప్రతి వీదిలో ఎగిరే విధంగా కార్యకర్తలను తయారు చేసారని అన్నారు
. ప్రదాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు. KNR సౌజన్యంతో మాధవ్ పుట్టిన రోజు సందర్భంగా అగనంపూడి గవర్నమెంట్ హాస్పిటల్ లో 100 మంది రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేసారు. గాజువాక శ్రీనగర్ డిజైర్ సొసైటీ హెచ్.ఐ.వి పాజిటివ్ పిల్లలకు పౌష్టికాహారం కిట్లు పంపిణీ మరియు పాతకర్నవానిపాలెం పార్టీ కార్యాలయంలో వంద మంది పేద మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేసామని కేఎన్ఆర్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గూటూరుశంకరరావు,బొత్సదిలీప్,రంగనాయకులు,ఈశ్వరరావు,కృష్ణారెడ్డి,ముసలయ్య,జాగారపుశ్రీను,తాతారావు,రవీంద్ర,రాజు,కేవి రమణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment