వీఎంఆర్డీఏ కార్యాలయంలో 80వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం సిరిపురం దరి వీఎంఆర్డీఏ కార్యాలయంలో
వీఎంఆర్డీఏ ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్గోపాల్ పాల్గొని ముందుగా మహానీయులు మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేద్కర్ల చిత్రపటాలకు పూలమాలంకరణ చేసి, నివాళులు అర్పించారు. అనంతరం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మనం ఈ రోజు ఇంత సురక్షిత జీవనం సాగిస్తున్నాం అంటే,
ఎందరో మహనీయుల ప్రాణత్యాగాలు, పోరాటాలు, దేశభక్తి మరియు అంకితభావం ఫలితమే అని. వారి త్యాగాలను స్మరించుకోవడం, వారి ఆశయాలకు అనుగుణంగా దేశాభివృద్ధికి మన వంతు కృషి చేయడం భారతీయులుగా మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. గౌ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నిర్దేశకత్వంలో విశాఖపట్నం మహానగర ప్రాంతం సమగ్రంగా, సుస్థిరంగా, పర్యావరణహితంగా అభివృద్ధి చెందేలా వీఎంఆర్డీఏ నిరంతరం కృషి చేస్తోందని, అలానే గ్రామీణ ప్రాంతాలను పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు నిదులు కేటాయించటం జరుగుతుందన్నారు. ఈ లక్ష్య సాధనలో సంస్థ అధికారులు,
ఉద్యోగులు మరియు సిబ్బంది అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, సౌకర్యాలు మరియు పారదర్శకమైన సేవలు అందించేందుకు మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు. వీఎంఆర్డీఏ ద్వారా ఇటీవల అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి అనుకున్న సమయంలో వాటిని పూర్తి చేసి విశాఖ అభివృద్ధి పట్ల మనయొక్క నిబద్ధతను చాటామని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టబోతున్నామని పేర్కొన్నారు.
మన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల సహకారం అత్యంత కీలకమని, స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, సమర్థవంతమైన వనరుల వినియోగం మరియు బాధ్యతాయుతమైన పౌర జీవనం ద్వారా మన నగరం మరింత సుందరంగా, సురక్షితంగా, అభివృద్ధి చెందిన ప్రాంతంగా రూపుదిద్దుకునేలా ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలని కోరారు.
మన దేశ ఐక్యత, సమగ్రత, శాంతి, సౌభ్రాతృత్వం మరియు అభివృద్ధి కోసం అంతా కలిసికట్టుగా ముందుకు సాగుదామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ దాట్ల కీర్తి, కార్యదర్శి మురళీకృష్ణ, ఒ.ఎస్.డి. కృష్ణానాయక్, ఎస్టేట్ అధికారి దయానిధి, ప్రధాన గణాంకధికారి శ్రీ ఋషిబాబు, పర్యవేక్షక ఇంజనీర్లు మధుసూదన రావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు
K.V.SHARMA EDITOR






Comments
Post a Comment