Skip to main content

జర్నలిస్టుల చట్టాల సవరణకు* *దేశవ్యాప్త పోరాటం* *సమాచారం సేకరణకు ఇబ్బంది లేకుండా చూడాలి* *పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు.. పెన్షన్ సాధిస్తాం* *ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు*


విశాఖపట్నం :డాబా గార్డెన్స్: విశాఖపట్నం ఆగస్టు 17 రాష్ట్రంలో జర్నలిస్టులు స్వేచ్ఛగాపూర్తి స్థాయిలో  సమాచారం సేకరించుకొని వార్తలు రాసుకోవడానికి కేంద్ర .రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు  కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు పేర్కొన్నారు.. ఇందుకోసం కేంద్రం తీసుకువచ్చిన ఐటీ చట్టంలో జర్నలిస్టులకు ఇబ్బందులు లేకుండా సవరణలు చేయాలని అప్పటివరకు దేశవ్యాప్తంగా రాజీలేని పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు సోమవారం డాబా గార్డెన్స్ వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ప్రెస్ క్లబ్ లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా జర్నలిస్టులు  ఎదుర్కొంటున్న పెను సవాళ్లు అనే అంశంపై ఆంజనేయులు ప్రత్యేక ప్రసంగం చేశారు.. గతంలో కేంద్రం తీసుకువచ్చిన సమాచార హక్కు చట్టం ప్రకారం ఎవరైనా ఎప్పుడైనా ఎటువంటి గోప్యత లేకుండా అవసరమైన సమాచారం తీసుకోవచ్చునని చెబుతుందన్నారు.. ఇక 2023లో కేంద్రం తీసుకువచ్చిన ఐటీ చట్టం ప్రకారం సమాచారం సేకరణ విషయంలో అనేక నిబంధనలు ప్రస్ఫుటం చేస్తుందన్నారు.. సమాచారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని గోప్యత పాటించాలని ఎలా పడితే అలా సమాచారం ఇవ్వడం కుదరదని కొన్ని అంశాలు చెబుతున్నాయన్నారు.. కాబట్టి దీనివల్ల నిజాయితీగా వార్తలు రాసే జర్నలిస్టులు కొన్ని సందర్భాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.. కొన్ని ప్రాంతాల్లో జర్నలిస్టులు సేకరించిన  సమాచారం కు సోర్స్ కోరుతూ అధికారులు పోలీసులు..నోటీసులు ఇస్తున్నారన్నారు.. కావున కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకొని 


పాత్రికేయులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమాచార సేకరణ కోసం అవసరమైన ఐటి చట్టంలో సవరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. పెన్షన్ సదుపాయం 


డిమాండ్లు సాధించి తీరుతామన్నారు..సభకు అధ్యక్షత వహించిన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి (ఎన్ఏజే) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం సాగించి తప్పకుండా సాధిస్తామన్నారు..అలాగే  జర్నలిస్టుల  హక్కుల సాధనకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు.. ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి కొన్ని సమస్యలు పరిష్కరించగలిగామన్నారు..ఈసందర్భంగా వీరు స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ లోగో ఆవిష్కరించారు..  ఈ సమావేశంలో ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ కార్యదర్శి జి శ్రీనివాసరావు  ఉపాధ్యక్షులు బి ..శివప్రసాద్బ్రాడ్ కాస్ట్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు.. కార్యదర్శి కింతాడ మదన్.. మల్ల దేవ త్రినాథ్ ..స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ కార్యదర్శి శ్రీనివాస్.. కె.వి.శర్మ  పి రవి శంకర్హ.హరి  బొబ్బర ప్రసాద్. రాజ శేఖర్. చక్రి. కోస్తా ప్రసాద్ ..తదితరులు పాల్గొన్నారు..

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...