Skip to main content

పంచాయతీ రాజ్ ఎస్.ఈ రామకృష్ణరెడ్డి సేవలు కొనసీమకు పదిలం... అట్టహాసంగా రామకృష్ణారెడ్డి దంపతులకు ఘనసన్మానం....

.               SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం...పంచాయతీరాజ్ డివిజన్ కార్యాలయ ఆవరణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఎస్సీగా పదోన్నతిపై కాకినాడకి బదిలీపై వెళ్లిన కార్యనిర్వాహక ఇంజనీర్ పులి రామకృష్ణారెడ్డిని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఉద్యోగులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు గజమాలతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. 


ముందుగా స్థానిక పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్ నుండి సతీసమేతంగా విచ్చేసిన రామకృష్ణారెడ్డికి  పూర్ణకుంభంతో స్వాగతం పలికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల అలంకరించి సభా ప్రాంగణానికి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ నుండి వచ్చిన తనని కోనసీమ ప్రజలు ఆప్యాయతగా చూసుకోవడం జీవితంలో మధురస్మృతులుగా ఉంటాయని తెలిపారు.


 డీఎస్పీ ప్రసాద్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలుపుతూ రామకృష్ణారెడ్డి పనికి నిబద్ధత కొలమానమని నూతనంగా డి ఎస్ పి కార్యలయం సుందరంగా తీర్చిదిద్దారని కొనియాడారు. డిఆర్ఓ వి. సుబ్బారావు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం నియోజకవర్గానికి ఎస్సీ గా బదిలీపై వెళ్ళటం సంతోష దాయకమని తెలిపారు. ఆర్ డి వో మాట్లాడుతూ కలెక్టర్ మన్నలను పొందిన అధికారని  కొనియాడారు. ప్రాజెక్ట్స్  డిప్యూటీ ఈఈ అన్యం రాంబాబు మాట్లాడుతూ కాయిర్ టెక్నాలజీతో కోనసీమ రోడ్స్ కు కలెక్టర్ సూచనలతో అభివృద్ధికి అంకురార్పణ చేశారన్నారు. డి. ఈ రాజ్ కుమార్ మాట్లాడుతూ అయన తక్కువగా మాట్లాడుతూ తమతో ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడే పనులను చేయించే వారని, 

ఆయన సూచనలు ఎప్పటికి మరువలేవమని అన్నారు.ఈ కార్యక్రమంలో నూతనంగా  బాధ్యతలు స్వీకరించిన ఈ ఈ సీతం నాయుడు కాకినాడ రఘురామ రెడ్డి సీతయ్య డి ఈ లు ఇంజనీరింగ్ సిబ్బంది కాంట్రాక్టర్ ఆంజనేయుల రెడ్డి, కాంట్రాక్టర్ అల్లాడి వెంకట రమణ కాంట్రాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...