శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం సింహగిరిపై పునర్వసు హోమం వైభవం - శ్రీరాముని జన్మనక్షత్ర పూజ.
సింహాచలం 11 ఆగస్టు 2026.సింహగిరి క్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో వెలుగో0దుతుంది. శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం పరిధిలో, గంగధార సమీపంలో కొలువై ఉన్న పురాతన ఉప ఆలయం శ్రీ రామాలయంలో, లోకారాధ్యుడు శ్రీరామచంద్రప్రభువు జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని నేడు పునర్వసు హోమ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
వేదఘోషలు, మంత్రనాదాలు, నాదస్వర వాద్యాల దివ్యనాదాల మధ్య ఈ పవిత్ర హోమం భక్తిశ్రద్ధలతో, కనులపండువగా నిర్వహించబడింది.
ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు ఆదేశాల మేరకు, అర్చక స్వాములు, వేదపండితుల ఆధ్వర్యంలో ఉదయం నుంచే ప్రత్యేక అర్చనలు, హోమ కార్యక్రమాలు, మంగళ దీపారాధనలతో ఆలయ ప్రాంగణం దైవీక వాతావరణంతో నిండిపోయింది.
పునర్వసు హోమంలో ముఖ్య భాగంగా, భక్తిపారవశ్యంతో మునిగి తేలేలా శ్రీరామ షడక్షరి పారాయణం, పవిత్ర సంక్షిప్త రామాయణ పారాయణం, మరియు వేదమంత్ర పఠనాలను అత్యంత నిష్ఠతోదివ్యమైన ఆధ్యాత్మిక పారాయణాలు నిర్వహించారు. యజ్ఞ గుండం నుంచి వెలువడిన దివ్య ధూమ, మంత్ర ఘోషలు సింహగిరి క్షేత్రమంతా మార్మోగి, అపారమైన ఆధ్యాత్మిక అనుభూతిని పంచాయి.
ఈ సందర్భంగా పాల్గొన్న వేదపండితులు మాట్లాడుతూ, "పునర్వసు నక్షత్రం శ్రీరాముని అవతారస్మరణకు ప్రతీక. ఈ రోజున ఆచరించిన పునర్వసు హోమం ద్వారా లోకక్షేమం, విశ్వశాంతి మరియు ధర్మ పరిరక్షణ సిద్ధించాలని భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాము" అని తెలిపారు.
ఈ మహోత్తర కార్యక్రమంలో భక్తులు, ఆలయ ఉద్యోగులు, సింహగిరి స్థానిక గ్రామ ప్రజలు పాల్గొని శ్రీరాముని దివ్య గుణగణాలను స్మరించుకుంటూ, అపారమైన పరమానంద భరితమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.
విశ్వశాంతి, లోకకల్యాణార్థమై పునర్వసు హోమం నిర్వహణ జరుగుతుందని – కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు తెలియజేశారు





Comments
Post a Comment