శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం, సింహాచలం సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ .
సింహాచలం:తేదీ: 01 ఆగస్టు 2026గౌరవ పార్లమెంట్ సభ్యులు, లోక్సభ ప్యానెల్ స్పీకర్, మాజీ డీజీపీ (ఐపీఎస్) శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ నేడు (శనివారం) సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. నాదస్వర మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ ఆలయంలోకి ఆహ్వానించారు.
అనంతరం అత్యంత మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకునే సంప్రదాయాన్ని నిర్వహించారు.
తదుపరి శ్రీ స్వామివారి సహస్రనామార్చన సేవలో పాల్గొని భక్తిశ్రద్ధలతో మూలవిరాట్టును దర్శించుకొన్నారు.
దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలు, జ్ఞాపికగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Comments
Post a Comment