Skip to main content

విద్యార్థులే వ‌ర్సిటీకి వెన్నెముక‌ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ ఏయూలో ఘ‌నంగా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు


ఆంధ్రవిశ్వవిద్యాలయం,ఆగస్టు15:విద్యార్థులే వ‌ర్సిటీకి వెన్నెముకని ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య జి.పి. రాజశేఖర్ అన్నారు

. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విశ్వవిద్యాలయంలోని క్రీడా మైదానంలో ఆయన జాతీయ జెండాను ఎగుర‌వేసారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయ అభివృద్ధితో పాటు విద్యార్థుల విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. 

విద్యార్థుల భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కెరీర్ ప్లానింగ్‌, డెవ‌ల‌ప్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు  తెలిపారు. ఇంటర్న్‌షిప్‌లు, ప్లేస్‌మెంట్లు, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, ఆవిష్కరణలను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశమన్నారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భార‌త దేశం సాంకేతిక‌త‌పై ఇత‌ర దేశాల‌పై ఆధార‌ప‌డ‌కుండా, స్వ‌యం సంవృద్ధి సాధించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. దీనికి యువ‌త మేధ‌స్సు, ఆవిష్క‌ర‌ణ‌లు కీల‌కంగా నిలుస్తాయ‌న్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. దీని ద్వారాసౌత్‌ క్యాంపస్‌లో 1,200 మంది సామర్థ్యంతో బాలికల హాస్టల్‌, నార్త్‌ క్యాంపస్‌లో 1,300 మంది సామర్థ్యంతో బాలుర హాస్టల్‌, 2,500 మంది సామర్థ్యంతో మెగా మెస్‌ నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. భవనాల డిజైన్లు దాదాపు పూర్తయ్యాయని, 

రెండు వారాల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. విద్యార్థుల్లో ఆవిష్కరణలు, పారిశ్రామిక ఆలోచనలను ప్రోత్సహించేందుకు స్టూడెంట్‌ స్టార్టప్‌ గ్రాంట్లు ప్రారంభించామని  తెలిపారు. ఎక్కువ మంది విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకుని గ్రాంట్లకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

బోధ‌న, ప‌రిశోధ‌న రంగాల‌లో జ‌రుగుతున్న ప్ర‌గ‌తి, ఏయూ సాధిస్తున్న అభివృద్ధిని వివ‌రించారు. ఏయూలో ప‌లు సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు నెల‌కొల్పుతున్నామ‌న్నారు. శతాబ్ది ఉత్సవాల విజయానికి విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, పాల‌క‌ మండలి సభ్యులు అందించిన సహకారానికి వీసీ కృతజ్ఞతలు తెలిపారు. విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సమష్టి కృషి అవసరమని పేర్కొన్నారు.

అధ్యాపకుల అభివృద్ధికి కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న యూజీసీ బకాయిల అంశంలో ఇటీవల కొంత ఉపశమనం లభించిందని, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. శతాబ్ది గ్రాంట్‌కు సంబంధించిన డీపీఆర్ సిద్ధ‌మ‌వుతోంద‌ని అది 

ఆంధ్ర విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని వీసీ విశ్వాసం వ్యక్తం చేశారు. విశ్వ‌విద్యాల‌యం అభివృద్ధికి సంపూర్ణ స‌హ‌కారం అందిస్తున్న పూర్వ విద్యార్థుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వారు విభిన్న రూపాల‌లో వ‌ర్సిటీకి త‌మ స‌హ‌కారాన్ని అందిస్తున్నార‌న్నారు.

కార్య‌క్ర‌మంలో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు అక‌ట్టుకున్నాయి. విశ్వ‌విద్యాల‌యంలో సుదీర్ఘ కాలం విశిష్ట సేవ‌లు అందించిన సిబ్బందికి అవార్డుల‌ను, స్వాతంత్య్ర దినోత్స‌వం పుర‌స్క‌రించుకుని నిర్వ‌హించిన పోటీల‌లో విజేత‌లుగా నిల‌చిన విద్యార్థుల‌కు బ‌హుమ‌తుల‌ను ప్ర‌ధానం చేశారు. 


కార్య‌క్ర‌మంలో రెక్టార్ ఆచార్య పులిపాటి కింగ్‌, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ప్రిన్సిపాల్స్‌, పాల‌క మండ‌లి స‌భ్యులు, ఆచార్యులు, విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...