Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం. * దివ్య క్షేత్ర అభివృద్ధికి సహకరించాలి * ఆక్రమిత ఇళ్లను ఖాళీ చేసి దేవస్థానం అభివృద్ధికి సహకరించాలి: ఆలయ ఈవో జల్లేపల్లి వెంకట్రావు.


సింహాచలం 13-08-2026 శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్ర అభివృద్ధిలో భాగంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను అనుసరించి భక్తులకు మరింత మెరుగైన వసతి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దేవస్థానం చర్యలు చేపడుతోంది.


ఈ నేపథ్యంలో దక్షిణ రాజగోపురం నుండి స్వామివారి నిత్య అన్నప్రసాదం భవనం వరకు ఉన్న ఆక్రమిత ఇళ్లను ఖాళీ చేయించే అంశంపై గురువారం కొండపైన పీఏసీ బిల్డింగ్‌లో సంబంధిత ఆక్రమణదారులతో దేవస్థానం అధికారులు సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి జల్లేపల్లి వెంకట్రావు, ఎస్‌డీసీ మధులత, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు, ఇన్‌చార్జ్ డిప్యూటీ ఇంజనీర్ రామరాజు, ఏఈఓ వాడ్రేవు రమణమూర్తి, పిల్లా శ్రీనివాసరావు, గడి అప్పలనాయుడు, పర్యవేక్షణ అధికారి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.



ఈ సందర్భంగా ఆలయ ఈవో జల్లేపల్లి వెంకట్రావు మాట్లాడుతూ, సింహాచలం దివ్య క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే దేవస్థానం ప్రధాన లక్ష్యమని తెలిపారు.


మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఆక్రమిత ఇళ్లను ఖాళీ చేసి దిగువ ప్రాంతానికి తరలివచ్చి దేవస్థానం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.

గతంలో నిర్వహించిన ఎన్యుమరేషన్ ప్రకారం అర్హత కలిగిన వారికి నిబంధనల మేరకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ స్థలాల కేటాయింపు ప్రక్రియ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఈవో స్పష్టం చేశారు.

ఈ అంశాన్ని అందరూ సామరస్యపూర్వకంగా చర్చించుకుని, దేవస్థానం అభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తుల సౌకర్యాలు, క్షేత్ర పవిత్రత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈవో కోరారు.

సమావేశంలో పాల్గొన్న ఆక్రమణదారులు కూడా విషయాన్ని పరస్పరం చర్చించుకుని తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని అధికారులకు తెలిపారు. అధికారులు, స్థానికులు పరస్పర అవగాహనతో సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు సమావేశం వేదికగా చర్చించారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...