Skip to main content

సబ్సిడీ బియ్యం కౌంటర్ ప్రారంభించిన గంటా*


కొమ్మాది, ఆగస్టు 7:_ స్థానిక రైతుబజార్ లో సబ్సిడీ ధరకు బియ్యం అందజేసే ప్రత్యేక కౌంటర్ ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. బహిరంగ మార్కెట్ లో రూ. 62 గా ఉన్న కేజీ స్టీమ్డ్ బియ్యాన్ని రూ.52కు.. రూ. 58 కు విక్రయిస్తున్న రా బియ్యం రూ. 50కు అందజేస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 115 రైతు బజార్లు, 


500 రైస్ మిల్లుల ఔట్ లెట్ స్టోర్ లలో తగ్గింపు ధరలకు ఈ రెండు రకాల బియ్యం లభిస్తుందని వివరించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ వి.అయ్యప్ప నాయుడు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, నాగోతి సత్యనారాయణ, పిల్లా వెంకట్రావు, మామిడి దుర్గారావు, కానూరు అచ్యుతరావు, గడ్డి శ్రీను, నాగోతి సూర్య ప్రకాష్, బోయి రమాదేవి, కాళ్ల నగేష్ కుమార్, కురుమిన లీలావతి, జేడీ పి.సుధాకర్, డీడీ శ్రీనివాస్, ఎస్టేట్ ఆఫీసర్ హరిత తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...