Skip to main content

శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం. అనావృష్టి నివారణకు శ్రీ త్రిపురాంతక స్వామి ఆలయంలో రెండవ రోజు వైభవంగా కొనసాగిన వరుణ జప యాగం.


దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ ఈవో జల్లెపల్లి వెంకటరావు పర్యవేక్షణలో లోకకల్యాణం, సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రంలో సుభిక్షం నెలకొనాలనే సంకల్పంతో సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ త్రిపురాంతక స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న మూడు రోజుల వరుణ జప యాగం రెండవ రోజు శుక్రవారం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగింది.


ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి శ్రీ కె. తిరుమలేశ్వరరావు పర్యవేక్షణలో ఉదయం గణపతి పూజ, పునఃపూజ, బలి పూజ, బలి హోమం, వరుణ జపం, వేదపారాయణం, నిత్యహోమం, పంచవింశతి (25) కలశాల స్థాపన, ప్రత్యేక ఆరాధన, నివేదన అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.


సాయంత్రం పంచవింశతి కలశాల ఆవాహన, వేదపారాయణం, నిత్యహోమం, నిత్య బలిహరణ తదితర వైదిక కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ వరుణ జప యాగం ద్వారా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖశాంతులు, పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...