Skip to main content

కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేయాలి. *వార్డుల డీలిమిటేషన్‌పై అభ్యంతరాలు, ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలి. *పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలి... ఒక్క ఓటరు కూడా మినహాయింపు కాకుండా, పేర్లు పునరావృతం కాకుండా పక్కాగా పరిశీలించాలి. *రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.


 విశాఖపట్నం, ఆగస్టు 20: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రానున్న జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేసి, పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి, చీఫ్ సిటీ ప్లానర్ ఏ. ప్రభాకర్ రావు, జోనల్ కమిషనర్లు, ఇతర అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే ఆదేశాలు, మార్గదర్శకాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి అనుగుణంగా జీవీఎంసీ ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియకు ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా జీవీఎంసీ వార్డుల విస్తరణ, డీలిమిటేషన్‌కు సంబంధించి అందుతున్న అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించి నిబంధనల మేరకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని చీఫ్ సిటీ ప్లానర్, జోనల్ కమిషనర్లను ఆదేశించారు.

అన్ని జోన్లలో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి, ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారనే వివరాలను పక్కాగా నమోదు చేయాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ఓటర్ల జాబితాల్లో ఒక్క ఓటరు పేరు కూడా మినహాయింపు కాకుండా, ఏ ఒక్కరి పేరు పునరావృతం కాకుండా క్షుణ్ణంగా పరిశీలించాలని, ఈ ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ స్పష్టం చేశారు.


పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది, ఎన్నికల సామగ్రి నిర్వహణపై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయడంతో పాటు, కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, వెలుతురు, మరుగుదొడ్లు, ర్యాంపులు, పారిశుధ్యం వంటి కనీస సదుపాయాలు ఉండేలా పరిశీలించాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు అనుకూలంగా పోలింగ్ కేంద్రాలు ఉండేలా ప్రణాళిక చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రతి జోన్‌లో ఎన్నికల ఏర్పాట్లపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, చేపట్టాల్సిన పనులు, బాధ్యత వహించే అధికారులు, పూర్తి చేయాల్సిన గడువులను నిర్దేశిస్తూ పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ అదనపు కమిషనర్ డివి రమణమూర్తికి ఆదేశించారు.


Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...