జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 25.02.2026
ఈరోజు అనగా తేదీ 25.02.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు రేవిడి గ్రామం నందు గౌరవ శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు వారు బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్, ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు పాల్గొన్నారు. తదుపరి భద్రయ్యపేట గ్రామాన్ని సందర్శించి ఇదివరలో ఇచ్చిన రాపిడ్ రెస్పాన్స్ టీమ్ రికమండేషన్స్ (దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి) పర్యవేక్షించి అక్కడ గల వైద్యులకి ఆదేశించారు. అక్కడ గల 17 మంది CKD వ్యాధి గ్రస్తులకు ఉచితంగా మందులు అందుతున్నాయో లేదో అని తనిఖీ చేశారు. అక్కడ ప్రజలకు అవగాహన కలుగ చేయాలని మెడికల్ అధికారి వారిని ఆదేశించారు. అక్కడ గల R.O వాటర్ ప్లాంట్ 4 రోజులనుండి పని చెయ్యట్లేదు. ఎంపిడిఓ వారితో మాట్లాడి R.O ప్లాంట్ మరమ్మతు పూర్తి చేయించారు.
ఈ సందర్శనలో డా.బి.ఉమావతి, DPMO-NHM, రేవిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం

Comments
Post a Comment