కిమ్స్ లో కన్నులవిందుగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం...కోనసీమ కిమ్స్ ప్రాంగణంలో భద్రాద్రి వైభవం...
అమలాపురం:, విశాఖ సందేసం.:..అమలాపురం కిమ్స్ వైద్య విద్యా కళాశాల ప్రాంగణంలో ఒక ఆధ్యాత్మికు వేదిక నిలిచింది. రేపటి నుండి జరగనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ముందుగా, లోక కల్యాణాన్ని ఆకాంక్షిస్తూ కిమ్స్ యాజమాన్యం నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అశేష భక్తజన సందోహం మధ్య అద్వితీయంగా జరిగింది. భద్రాచలం నుండి తరలివచ్చిన ఉత్సవ మూర్తులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కిమ్స్ ప్రాంగణం ఆధ్యాత్మిక చైతన్యంతో పులకించిపోయింది. యాగశాలలో విశ్వశాంతి హోమాలు శుక్రవారం ఉదయం నుండి కిమ్స్ వేదికగా ఆధ్యాత్మిక క్రతువులు ప్రారంభమయ్యాయి. విశ్వశాంతిని కోరుతూ నిర్వహించిన శ్రీ లక్ష్మీ గణపతి హోమం, చండీ మహాయాగం విశేషంగా సాగాయి. కిమ్స్ అధినేత కేవీవీ సత్యనారాయణ రాజు (చైతన్య రాజు), మేనేజింగ్ డైరెక్టర్ రవి వర్మ కలిదిండి ఆధ్వర్యంలో ఈ హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి.
ముఖ్య అతిథులు కలిదిండి వీర వేంకట సత్యనారాయణ రాజు, బదరీ లక్ష్మీ దంపతుల సారథ్యంలో సీతారాముల కళ్యాణోత్సవం ప్రారంభమైంది. భద్రాచలం దేవస్థానం నుండి వచ్చిన అర్చకులు ఉదయం 10 గంటలకు అభిజిత్ లగ్నమందు కళ్యాణ క్రతువును కన్నుల పండువగా జరిపించారు. కిమ్స్ ప్రాంగణమంతా భక్తులతో నిండి, జై శ్రీరామ్ నినాదాలు హోరేత్తాయి....




Comments
Post a Comment