Skip to main content

జనన, మరణ నమోదులో పలు నియమాలు -          జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్

 విశాఖపట్నం ఫిబ్రవరి 25: జనన-మరణాల నమోదు చట్టం 1969 యొక్క సెక్షన్ 30 ద్వారా ప్రదతమైన అధికారాలను వినియోగించి కేంద్ర ప్రభుత్వం అనుమతితో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1999 నాటి ఆంధ్రప్రదేశ్ జనన - మరణాల నమోదు నియమాలను రద్దుచేసి 2025 జనన మరియు మరణాల నమోదు నియమాలు. ఆంధ్రప్రదేశ్ గజిట్ నోటిఫికేషన్ ప్రచురణ ద్వారా తేదీ 17.02.2026 నుండి పలు నియమాలు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనన, మరణాల నమోదు నిమిత్తం అమల్లోకి వచ్చిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి ,జనన మరణ ప్రిన్సిపల్ రిజిస్టర్ డాక్టర్ ఈ ఎన్ వి నరేష్ కుమార్ బుధవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు

ప్రభుత్వం పొందుపరిచిన నియమాలు కానీ ,జరిగిన జననం/ మరణములు, పుట్టిన /మరణించిన తేదీ నుండి 21 రోజులలో ఉచితంగా నమోదు చేస్తారని, ఇంటి వద్ద కానీ, ఆసుపత్రిలో గాని జరిగిన జనన మరణములు పుట్టిన/ మరణించిన తేదీ నుండి 21 రోజుల నుండి 30 రోజుల్లోపు రూ.25/- ఆలస్య రుసుం చెల్లించి నమోదు చేసుకోవాలని, 30 రోజుల నుండి ఒక సంవత్సరంలోపు రూ. 250/- ఆలస్య రుసుము చెల్లించి నమోదు చేసుకోవచ్చని, ఒక సంవత్సరము తర్వాత రూ. 500/- ఆలస్యం రుసుము చెల్లించి నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. పుట్టిన బిడ్డ జననం నమోదు చేసిన తర్వాత ఒక సంవత్సరంలోపు ఉచితంగా శిశువు పేరును నమోదు చేసుకునే అవకాశం ఉందని, ఒక సంవత్సరం నుండి 15 సంవత్సరాలలోపు రూ. 250/- ఆలస్య రుసుము చెల్లించి శిశువు పేరును నమోదు చేసుకోవచ్చన్నారు.

జనన మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయుటకు లేదా లభ్యత లేని ధ్రువపత్రాలు (non availability certificate) కొరకు జననం మరణం శోధన చేసేందుకు ఒక సంవత్సరమునకు రూ. 50/- చెల్లించి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ పొందవచ్చునని, అదనపు సంవత్సరం శోధన చేయుటకు రూ. 25/- రూపాయలు చెల్లించి non availability certificate పొందవచ్చునని తెలిపారు. ప్రతి జనన లేదా మరణముకు సంబంధించిన ధ్రువపత్రం పొందుటకు జీవీఎంసీ సౌకర్యం కౌంటర్ లో రూ. 50/-  చెల్లించి రసీదు తో పాటు సంబంధిత డాక్యుమెంట్లను  కూడా జత పరిచి జనన మరణ ధ్రువీకరణ పత్రం పొందవచ్చునని ప్రధాన వైద్యాధికారి తెలిపారు.

                పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ


Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...