Skip to main content

శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ కుటుంబం* .. *తిరుమలలో వాసుపల్లి సాకేత్, శ్రావణి నూతన దంపతులు*...

దక్షణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రెండవ కుమారుడు వాసుపల్లి సాకేత్, శ్రావణి వివాహ వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నవ దంపతులతో వాసుపల్లి గణేష్ కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారి వివాహ దాంపత్య జీవితం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఇష్ట దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్నీ సందర్శించారు. స్వామివారి దర్శనం అనంతరం విశాఖకు బయలుదేరి రానున్నారు. తన కుమారుని వివాహ వేడుకలు హాజరైన పెద్దలకు, నేతలకు, కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులకి మరొకసారి వాసుపల్లి గణేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...