అమలాపురం ప్రముఖ హోటల్లో కుళ్ళిన చికెన్ బిర్యానీ. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు తీరుపై ప్రజలు ఆగ్రహం . ..
అమలాపురం, :విశాఖ సందేసం :ప్రస్తుత రోజుల్లో ఏమి తినేటట్లు లేదు అనడానికి నిదర్శనం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం హోటల్స్ లో చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పాల కేంద్రాలే కాకుండా ఫుడ్ సేఫ్టీ విషయలలో ముడుపులకు తలాగ్గుతున్నారా... అధికారానికి బయపడుతున్నారా అన్నా సందేహం కలుగుతుంది. ఏదైనా విషయం బయటకు వస్తే ఆ రెండు రోజులు అధికారులు హడావిడే తప్ప మళ్ళీ కన్నెత్తి చూడని ఫుడ్ సేఫ్టీ అధికారులు.అమలాపురం గడియారం స్తంభం సెంటర్ దగ్గర్లో గల ప్రముఖ ఎ బి సి డి రెస్టారెంట్లో కుళ్ళిన మాంసంతో తయారుచేసిన బిర్యాని విక్రయాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కస్టమర్..వీడియో వైరల్ గా మారడంతో రెస్టారెంట్ ను అమలాపురం మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించిన మున్సిపాలిటీ సిబ్బంది పలు ఆహార శాంపిల్స్ ను సేఖరించారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్విరాన్మెంటల్ ఏఈ కె వెంకటేష్, సానిటరీ ఇన్స్పెక్టర్ కుమార్ స్వామి తనిఖీలు నిర్వహించి ఫుడ్ నాణ్యతపై ఆరా తీశారు. ఏదైనా సంఘటన చోటుచేసుకున్న సందర్భంలోనే స్పందిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు...ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్లక్ష్యపు తీరుపై అంబేద్కర్ కోనసీమ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ లో తనిఖీలు నిర్వహించాలని సామాజిక మధ్యమాలలో వీడియోను వైరల్ చేస్తున్నారు.


Comments
Post a Comment