అంగన్వాడీ కేంద్రాలు, పాల సేకరణ కేంద్రాలు, డెయిరీలు, హోటళ్లు, స్వీట్లు తయారు చేసే దుకాణాలు, టీ స్టాళ్లు వంటి ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి నమూనాలు సేకరించాలని సూచించారు. ల్యాబ్ పరీక్షల ద్వారా పాల నాణ్యతను నిర్ధారించి, కల్తీ నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని కోరారు.
అదేవిధంగా, ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ కి లేఖ రాశారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. అవసరమైతే టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు చేయాలని అభిప్రాయపడ్డారు. ఒకటికి మించి నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారుల లైసెన్సులు రద్దు చేసే చర్యలు కూడా తీసుకోవాలని కోరారు.
ప్రజలకు కూడా ఆయన కొన్ని సూచనలు చేశారు. పాలు కొనుగోలు చేసే సమయంలో నాణ్యతపై శ్రద్ధ వహించాలని, అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తక్కువ ధరకు లభిస్తున్న పేరులేని పాల ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో జాగ్రత్త వహించాలని చెప్పారు. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా పాలు, పాల పదార్థాలు తీసుకుంటారని, వారి ఆరోగ్యాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీ ఉండదని ఎంపీ మద్దిల గురుమూర్తి స్పష్టం చేశారు. ప్రజారోగ్యం దృష్ట్యా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈ లెఖలో ఎంపీ కోరారు.
Sharma K.V.Editor

Comments
Post a Comment