Skip to main content

రాజకీయ కలయిక కాదు.. ఇది కుటుంబాల కలయిక! కూటమి సహచరులపై లోకేష్ చాటుకున్న ప్రేమానురాగలకు నిదర్శనం : ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు

అమలాపురం:విశాఖ సందేసం:ఉభయ  గోదావరి జిల్లాల కూటమి నేతలపై నారా  లోకేష్  ఆత్మీయ జల్లు కురుపించి   విందులో వెల్లివిరిసిన ప్రేమ, ఆప్యాయతలతో పరవశించిన కూటమి నేతల కుటుంబాలు...

ఉండవల్లి నారా లోకేష్  నివాసంలో గోదావరి ప్రజాప్రతినిధులకు అపురూప ఆతిథ్యంగా నిలిచింది.

మంగళవారం అమలాపురం ఎమ్మెల్యే  అయితాబత్తుల ఆనందరావు  తన కుటుంబ సమేతంగా ఐటీ మరియు  విద్యాశాఖ మంత్రివర్యులు, యువనేత  నారా లోకేష్ ను  ఉండవల్లిలోని అయన  నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ భేటీ కేవలం ఒక అధికారిక కలయికలా కాకుండా, రెండు కుటుంబాల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని చాటిచెప్పింది. ఎమ్మెల్యే ఆనందరావు  కుటుంబ సభ్యులతో లోకేష్  ఎంతో సాదాసీదాగా సంభాషించిన తీరు, ఆయనలోని సంస్కారానికి మరియు గొప్ప నాయకత్వ లక్షణాలకు నిదర్శనమని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. ఒక బిజీ షెడ్యూల్‌లో ఉండి కూడా, తన వారి కోసం సమయాన్ని కేటాయించి ఆత్మీయతను పంచడం లోకేష్ కే  చెల్లిందని ఎమ్మెల్యే అన్నారు.

ఆంధ్రప్రదేశ్ పురోగతికి అహర్నిశలు శ్రమిస్తున్న లోకేష్  అద్భుతమైన నాయకత్వంలో మన రాష్ట్రం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే ఆనందరావు  మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...