Skip to main content

పోలీసు స్టేషన్లలో తణిఖీలు నిర్వహించిన ఎలూరు రేంజ్ ఐజి. జివిజి అశోక్ కుమార్..

అమలాపురం :విశాఖ సందేసం.:..డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పలు    పోలీసు స్టేషన్లలో  బుధవారం  ఏలూరు రేంజ్ ఐజి. జివిజి అశోక్ కుమార్ తనిఖీలు నిర్వహించారు. ముందుగా మురమళ్ళ శ్రీ వీరస్వామి ఆలయంలో  వీరేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తనిఖీలు నిర్వహించిన  సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  ఐ.జి  అశోక్ కుమార్   మాట్లాడుతూ  యానాం సరిహద్దులో ఉండటం వల్ల మద్యం, పెట్రోలు,డీజిల్ స్మగ్లింగ్‌ జరుగుతూ ఉంటుంది వీటిని పూర్తి స్థాయిలో అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని, 

ఈ ప్రాంతం హైవే ప్రాంతం కావడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ట్రాఫిక్ అధికంగా ఉండే పాత ఇంజరం - ఎదుర్లంక బ్రిడ్జి, కొమరగిరి ప్రాంతాలను ప్రమాదకరమైన 'బ్లాక్ స్పాట్స్'గా గుర్తించామన్నారు . గత మూడేళ్లలో ఇక్కడ 24 మంది మరణించగా, ప్రమాదాల తగ్గింపునకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ముఖ్యంగా  గోదావరినదిలో దూకి చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, గోదావరి వంతెనపై ఆత్మహత్యలను నిరోధించడానికి 52 సీసీ కెమెరాలు, మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేశాము. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు పెట్రోలింగ్ మరియు అవగాహన బోర్డులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి, సస్పెక్ట్ షీట్లు తెరిచాము. 

పేదరికాన్ని ఆసరాగా చేసుకుని జరిగే ఇటువంటి నేరాల పట్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.గంజాయి స్మగ్లింగ్ ను పూర్తిగా అడ్డుకున్నామని, గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు అన్ని విధాలా  చర్యలు తీసుకున్నామని‌ అన్నారు.ఈ పర్యటనలో ఆయన వెంట జిల్లా ఎస్.పి రాహుల్ మీనా, అమలాపురం డి.ఎస్.పి టి.ఎస్.ఆర్.కె ప్రసాద్. ముమ్మిడివరం సిఐ, స్దానిక ఎస్.ఐ సిబ్బంది పాల్గొన్నారు.....

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...