* బారికేడింగ్తో సహా అన్ని సివిల్, నిర్మాణ పనులను మార్చి 31లోపు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి.
* సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ, సంతృప్తికరంగా దర్శనం కల్పించేలా చర్యలు.
* గతంలో గాలులు, వర్షాల వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, క్యూ లైన్ల వెంబడి సాధ్యమైనంత వరకు శాశ్వత షెల్టర్లు ఏర్పాటు.
ఎలక్ట్రికల్ మరియు ఫైర్ సేఫ్టీ తనిఖీలు తప్పనిసరిగా నిర్వహించాలి.* సాధారణ భక్తులకు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10–11 గంటల వరకు దర్శనం కల్పించేలా ప్రణాళిక.
* VIP / VVIP దర్శనాలకు ఉదయం 3 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక టైమ్ స్లాట్లు కేటాయింపుకు మార్గదర్శకాలు.
ఉదయం 5 గంటలలోపు అంతరాలయ దర్శనాలు ముగించాలని ప్రాథమిక నిర్ణయం.* ₹300, ₹1000, ₹1500 దర్శన క్యూ లైన్లు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రారంభించి, రద్దీ నియంత్రణకు పటిష్ట చర్యలు.
భక్తుల రాకపోకల కోసం బస్సుల నిర్వహణ, పికప్–డ్రాప్ పాయింట్లు, పార్కింగ్ ప్రాంతాలపై స్పష్టమైన ప్లాన్ సిద్ధం చేయాలని సూచనలు.* ఆలయ ప్రాంగణంలోకి సెల్ఫోన్లకు అనుమతి లేదు – పోలీస్ సిబ్బంది, సేవా వలంటీర్లతో నిరంతర పర్యవేక్షణ.
* ఈ ఏడాది సుమారు 1.20 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా.
* దర్శనం అనంతరం భక్తులు వేగంగా బయటకు వెళ్లేందుకు ఆగమశాస్త్రం ప్రకారం అదనపు ర్యాంపులు ఏర్పాటు.
* ప్రజాప్రతినిధులతో చర్చల అనంతరం, దర్శన సమయాలపై తుది నిర్ణయాన్ని మీడియా ద్వారా అధికారికంగా ప్రకటిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
సమీక్ష అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు వీరికి ఆలయ కార్య నిర్వహణ అధికారి జెబి వెంకటరావు స్వాగతం పలికి ముందుగా కప్పస్తంభమాలింగనము తదుపరి స్వామి వారి దర్శనము అనంతరము వేద పండితుల వేద ఆశీర్వచనము తదుపరి స్వామివారి ప్రసాదాలని అందజేశారు.వీరితో ఆలయం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ సహాయకార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు ఇంజనీరింగ్ అధికారులు, టూరిజం అధికారులు తదితరులు ఉన్నారుకె. వి. శర్మ, ఎడిటర్,







Comments
Post a Comment