Skip to main content

గాయత్రి లో ఘనంగా జాతీయ సైన్స్ డే

స్థానికంగా యం.వి.పి. కాలనీ గాయత్రీ విద్యాపరిషత్ డిగ్రీ మరియు పి.జి కళాశాల (అటానమస్) సెమినార్ హాల్ లో జాతీయ సైన్స్ డే విజ్ఞాన వినోదాల సమ్మేళనంగా ఘనంగా నిర్వహింప బడినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పి.సతీశ్ కుమార్, ప్రోసెస్ డెవలప్ మెంట్ విభాగం అధిపతి, అపిటోరియా ఫార్మసి, హైదరాబాద్ నుండి 

విచ్చేసిరి ,రామన్ ఎఫెక్ట్స్' పరి శోధన ద్వారా భారత దేశానికి భౌతిక శాస్త్రంలో తొలి నోబెల్ బహుమతి సాధించిన సర్ సి.వి. రామన్ సేవలు ప్రపంచదేశాల ప్రశంసలు అందుకున్నారని నివాళి ఘటించారు. women in Science, catalysing Viksith Bharat" సైన్సు లో మహిళలు వికసిత్ భారత్ ఉద్దీపనం అనే అంశం తో నిర్వహింపబడు తున్నదని శాస్త్రీయ వైజ్ఞానిక సాంకేతక వైద్య రంగాలలో మహీళలు అద్భుతమైన  ఆవిష్క రణలు  చేస్తున్నారని, మహిళలకు ప్రోత్సాహకాలు, మెంటార షిప్ లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని, క్వాంటమ్ కంప్యూటింగ్ లో తగిన శిక్షణ ఇవ్వాలని నైతిక విలువలతో సామాజిక బాధ్యతతో భద్రతకోసం యువతరం శాస్త్రీయ దృక్పథం 

వినియోగించాలని స్ఫూర్తి దాయక సందేశం అందించారు. ఆచార్య కె.ఎస్.  బోస్, కళాశాల ప్రిన్సిపాల్, మరియు శ్రీయుతులు డి.గిరిధర్ డైరెక్టర్ యుజి కోర్సులు,రివ్యూలో జిజ్ఞాసను, ఆసక్తిని అభినందిస్తూ, ఇది విద్యార్థుల వ్యక్తిత్వవికాసానికి నిదర్శనంగా  నిలుస్తుందని, కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ కంప్యూటింగు రంగాలలో కళాశాల కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను వినియోగించుకుని  నూతన సాంకేతిక పరిజ్ఞానం  తో ఉపాధి అవకాశములను  కైవసం చేసుకోవాలని సందేశం అందించారు .

ఇటు అధ్యాపక బృందం, అటు విద్యార్థులు సమైక్యంగా నిర్వహించిన. జాతీయ సైన్సుడే ఆహూతుల ప్రశంసలను అందుకొన్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ (stalls) అందరిని ఆకట్టుకున్నాయి. శ్రీ డి. దక్షిణామూర్తి గారు  వైస్ ప్రెసిడెంట్ గాయత్రి విద్యా పరిషత్,ఆచార్య ప్రగడ రాజ గణపతి గారు వ్యవస్థాపక సభ్యులు గాయత్రి విద్యా పరిషత్ తమ ప్రసంగంలో నిత్య జీవితంలో సైన్స్ గురించి విద్యార్థులకు ఆసక్తి జనకంగా తెలియచేసారు , ఆచార్య పి.వి మోహిని ఆచార్య పి.వినయ్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆచార్య సాయి రూప్, ప్రజా సంబంధాల అధికార శ్రీమతి శేషపద్మ ,అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు .మీ జాతీయ సైన్స్ డే విద్యార్థుల ప్రతిభాపాటవాలకు నిదర్శనంగా ఘనంగా నిర్వహించబడింది

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...