Skip to main content

సెయింట్ జోసెఫ్ కళాశాలలో ది జాయ్స్ ఆఫ్ గివింగ్ అండ్ లివింగ్ – గ్రంథావిష్కరణ

విశాఖ: విశాఖ సందేశం: ఆఫీస్ మేనేజ్‌మెంట్ విభాగ పూర్వ అధ్యక్షులు  కీర్తి శేషులు

డి.ఏ. రమణి రచించిన“ది జాయ్స్ ఆఫ్ గివింగ్ అండ్ లివింగ్ – మెమరీస్ రీకౌంటెడ్” గ్రంథావిష్కరణ కార్యక్రమం ఫిబ్రవరి 26వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు జ్ఞానాపురంలోని సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాలలో ఘనంగా నిర్వహించబడింది.

విశాఖపట్నం ఆర్చ్‌బిషప్ ఎమిరిటస్ మోస్ట్ రేవ్. ఎం. ప్రకాష్ గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం మొదటి ప్రతిని రమణి తల్లి గారికి అందజేశారు. ఈ సందర్భం సభలో భావోద్వేగ వాతావరణాన్ని నెలకొల్పింది.

కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీ, ప్రొవిన్షియల్ సుపీరియర్ సిస్టర్ మార్గరెట్ మేరీ  తదితరులు రమణి కళాశాలకు అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ఆమె క్రమశిక్షణ, అంకితభావం, విద్యార్థుల పట్ల చూపిన మమకారం గురించి విశదీకరించారు.రమణి ధనరాజ్ సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాలలో 36 సంవత్సరాల పాటు విశేష సేవలందించారు. ఆమె ఇటీవల క్యాన్సర్ వ్యాధితో కన్నుమూశారు. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమె సహోదరులు ఈ గ్రంథాన్ని విడుదల చేశారు.

ఆమె ఉపాధ్యాయులు, బంధువులు, సహచరులు, సహోద్యోగులు, స్నేహితులు మరియు విద్యార్థులు ఆమెతో ఉన్న అనుభవాలను పంచుకుంటూ ఆమె సాదాసీదా స్వభావం, సేవాభావం, ఆత్మీయతను , అంకితభావాన్ని స్మరించుకున్నారని కళాశాల పీ ఆర్ వో డాక్టర్ పి కె జయలక్ష్మి తెలిపారు. రాణి థనరాజ్ వందన సమర్పణలో కార్యక్రమం హృద్యంగా సాగింది. అనంతరం భోజన విందు ఏర్పాటు చేశారు.

                           కె. వి. శర్మ, ఎడిటర్,

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...