Press Note *భారతీయ జనతా పార్టీ జనతా వారధి ఉత్తరాంధ్ర కార్యాలయంలో వినతులు స్వీకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు*
ఈరోజు 27-02-2026 శుక్రవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సారధ్యంలో జరుగుతున్న జనతా వారధి ప్రజలకు ప్రభుత్వానికి వారధి కార్యక్రమం లో భాగంగా బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు గారి ఆధ్వర్యంలో జనతా వారధి ఉత్తరాంధ్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డా రెడ్డి పావని గారు ప్రజల నుండి వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు మాట్లాడుతూ ప్రజలకు ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలను అర్జీలను స్వీకరించి ఈ జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ జనతా వారధి కార్యాలయంలో ప్రతి శుక్రవారం ఒక MLA అందుబాటులో ఉంటూ ప్రజల నుండి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్ర మోహన్, శ్రీమతి ఉమ్మిడి సుజాత రాజ్, బీజేపీ జనతా వారధి కో కన్వీనర్ మూల వెంకటరావు, G ప్రేమ కుమారి తోపాటు పలువురు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.




Comments
Post a Comment