Skip to main content

*వైభవంగా గడుగుపల్లి భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమామృత సేవా నిలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు -నిరుపేద గిరిజన మహిళలకు కుట్టు యంత్రాలను అందచేసిన శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ R. లక్ష్మణరావు*

ఈ సందర్భంగా ప్రధాన ఆకర్షణగా, హుకుంపేట మండలం అండిబ గ్రామంలో శ్రీ సత్యసాయి  శత  జయంతి ప్రేమామృతధార త్రాగునీటి ప్రాజెక్ట్‌ను, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు గారు  ప్రారంభించారు.

ఈ త్రాగునీటి ప్రాజెక్ట్ ద్వారా గిరిజన కుటుంబాలకు సురక్షిత త్రాగునీటి సౌకర్యం లభించి గ్రామస్తుల్లో అపార ఆనందం, కృతజ్ఞత వెల్లివిరిసింది.

గ్రామస్తులు సంప్రదాయ ధింసా  నృత్యంతో ఘన స్వాగతం పలికారు. రంగురంగుల చీరలు, పూల అలంకరణతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది.

స్వయం ఉపాధి, ఆర్థిక స్వాతంత్య్రం , మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ, ఉచిత టైలరింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన నిరుపేద గిరిజన మహిళలకు కుట్టు యంత్రాలను శ్రీ లక్ష్మణరావు గారు అందజేశారు. నూతనంగా సంపాదించిన నైపుణ్యాలను సమర్థవంతంగా వినియోగించుకొని మెరుగైన జీవనోపాధిని పొందాలని, ఇతరులకు సహాయం చేయాలని శ్రీ లక్ష్మణరావు గారు ప్రోత్సహించారు.

తన పర్యటనలో భాగంగా శ్రీ లక్ష్మణరావు గారు శ్రీ సత్యసాయి గిరిజన సేవా నిలయంలో జరుగుతున్న మహిళలు, యువతకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర అధ్యక్షులు సమీక్షించి, గిరిజన సమాజాభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తున్నఅల్లూరి సీతారామరాజు  జిల్లా శ్రీ సత్య సాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ గణేష్ మరియు వారి  బృందాన్ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి సేవా  సమితి కన్వీనర్లు, జోనల్ కోఆర్డినేటర్లు, భజన మండలి కన్వీనర్లు, యువజన సమన్వయకర్తలు (పురుష, మహిళ)తో పాటు మొత్తం 500 పైగా సభ్యులు పాల్గొని ఈ వేడుకను ఆధ్యాత్మికంగా, సంస్థాగతంగా విశిష్ట కార్యక్రమంగా మలిచారు.

ఈ వేడుక భక్తి, సేవ, ఐక్యత భావాలతో ముగిసింది స్వామి సందేశమైన “ప్రేమించండి అందరిని – సేవించండి అందరికి” అనే నూతన నిశ్చయంతో కార్యక్రమం ముగిసింది.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...