Skip to main content

సోమవారం జివిఎంసి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం . పునర్వ్యవస్థీకరణ చెందిన 10 జోన్ లలో పి జి ఆర్ ఎస్ కార్యక్రమం నిర్వహణ. -విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. -జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్.

 విశాఖపట్నం, మార్చి 01 : మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోను, పునర్వ్యవస్థీకరణ చెందిన భీమిలి, మధురవాడ , ఈస్ట్, వెస్ట్, సౌత్ ,నార్త్, పెందుర్తి ,గాజువాక, అగనంపూడి అనకాపల్లి జోన్ల కార్యాలయాల్లోనూ "ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( Public Grievance Redressal system-PGRS )కార్యక్రమం" 2026 మార్చి 02 వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించబడునని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ పత్రికా ప్రకటన ద్వారా ఆదివారం తెలిపారు.

కావున, నగరంలో పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, నీటి సరఫరా, వీధి దీపాలు,హారికల్చర్, రెవిన్యూ, యు సి డి, ఇంజినీరింగ్ మొదలగు జీవీఎంసీ విభాగాలకు సంబంధించిన సమస్యలపై 2026 మార్చి 02 వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నగర ప్రజలు అర్జీల ద్వారా సమస్యలను తెలియపరుచుకోవచ్చునని నగర ప్రజలకు విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ తెలియచేశారు. 

గమనిక: 1) జీవీఎంసీ వెస్ట్ జోన్ కార్యాలయం 52 వ వార్డు లో గల ఎన్. ఎ .డి కొత్త రోడ్డు , గౌరీ నగర్ లో పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం నందు ఏర్పాటు చేయడమైనది. 

2) నార్త్ జోన్ కార్యాలయం 51 వ వార్డులో మాధవధార ఉడా లేఅవుట్, ఆర్ . టి. ఎ ఆఫీస్ రోడ్డు, పంప్ హౌస్ వెనుక ఉత్తర నియోజకవర్గం కార్యాలయం లో ఏర్పాటు చేయడమైనది. 

3) అగనంపూడి జోన్ కార్యాలయం 85వ వార్డులో పెదమడక, శివాలయం రోడ్డు , వినాయక టెంపుల్ సమీపములో గల రాజీవ్ గాంధీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడమైనది. 

కావున ప్రజలు ఈ పై జోన్ల ప్రదేశాలను గమనించవలసిందిగా కోరుచూ ,మిగిలిన అన్ని జోన్ల కార్యాలయాలు యధాస్థానంలో ఉన్నవని తెలియపరచడమైనది.

పౌర సంబంధాల అధికారి, జివిఎంసి


Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...