Skip to main content

అమరజీవికి ఘన నివాళులు* *పొట్టి శ్రీరాములు సేవలు* *అజరామరం* *ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పరితపించిన వ్యక్తి* *125 వ జయంతి సందర్భంగా* *ఘనంగా నివాళులర్పించిన గంట్ల*

 విశాఖపట్నం మార్చ్ 16 తన ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసం.. ప్రత్యేక రాష్ట్రం కోసం పాటుపడిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని తెలుగు వారి గుండెల్లో ఆయన చిరస్మరణీయులుగా నిలిచిపోయారని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు అన్నారు.. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా  సోమవారం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో గంట్ల శ్రీనుబాబు  పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ.. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని కోరుకోవడం తోపాటు అది సాధించే వరకు శ్రీరాములు తన నిరంతర ప్రయత్నం కొనసాగించి  మహోన్నత వ్యక్తిగా నిలిచిపోయారని అభివర్ణించారు..

అటువంటి మహోన్నతమైన ఆశయాలు కలిగిన పొట్టి శ్రీరాములు విగ్రహం అమరావతిలో ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...