అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125 వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్.,గారు.* *ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన మహానీయుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు, ఆ మహనీయుని జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకొని పట్టు విడవకుండా లక్ష్యాలను సాధించాలి- పోలీసు కమిషనర్
ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ 1901 మార్చి 16న ప్రస్తుత చెన్నై నగరంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జన్మించారన్నారు. చిన్నప్పటి నుంచే ఆయనలో సేవాభావం, దేశభక్తి, నిబద్ధత వంటి గొప్ప లక్షణాలు ఉన్నాయన్నారు. దేశ సేవ కోసం తన సుఖవంతమైన జీవితాన్ని వదిలిపెట్టారన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా మారి, మహాత్మా గాంధీ గారి ఆలోచనలతో ప్రభావితమై అహింసా మార్గంలో పోరాటం చేశారన్నారు. అప్పటిలో మద్రాస్ రాష్ట్రంలో ఉన్న తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలన్న డిమాండ్తో 1952 అక్టోబర్ 19న మద్రాసులో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారన్నారు. 58 రోజుల పాటు పట్టు వీడకుండా తన నిరాహార దీక్షను కొనసాగించి రాష్ట్ర సాధన కొరకు అమరుడైనారని గుర్తు చేశారు. అనంతరం భాష ప్రాతిపదికన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆయన త్యాగం ఎప్పటికీ తెలుగు ప్రజలు మరవరాదన్నారు. యువత ఆ మహనీయుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని తమ లక్ష్యాలను సాధించేందుకు అహర్నిశలు కృషి చేయాలన్నారు.
Dr Nanduri Ramakrishna
Sr Sub EDITOR

Comments
Post a Comment