Skip to main content

15న వర్కింగ్ జర్నలిస్టుల ఉగాది సంబరాలు* *పంచాంగ శ్రవణం, కవిసమ్మేళనం* *ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు* ,*విందుభోజనం.. మహిళలకు చీరలు పంపిణీ*


అక్కయ్యపాలెం జంక్షన్, మార్చి 10ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపి బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ , ఏపి స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో ఈనెల 15న (ఆదివారం)వర్కింగ్ జర్నలిస్టుల ఉగాది సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి.నారాయణ, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావులు తెలిపారు. ఉగాది పర్వదినం నేపధ్యంలో మంగళవారం అక్కయపాలెం ప్రాంతంలోని ఒక ప్రయివేటు హోటల్ లో ప్రత్యేక కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఈనెల 15న ఉదయం 9 గంటల నుంచి పూర్ణామార్కెట్ సమీపంలో ఉన్న క్రాంతి ధియేటర్ లో ఉగాది సంబరాలు ప్రారంభమవుతాయన్నారు. అల్పాహారం నుంచి మధ్యాహ్నం విందు భోజనం వరకు ఆయా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కవిసమ్మేళనం, పంచాంగశ్రవణం, పంచాంగాల పంపిణీతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మహిళలకు ప్రత్యేకంగా చీరలు పంపిణీ చేస్తామన్నారు. ప్రతీ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా పంచాంగ శ్రవణం నిర్వహించిన పండితులతో పాటు అతిధులను ఘనంగా సత్కరించనున్నట్లు వీరు వివరించారు. 

కావున వర్కింగ్ జర్నలిస్టులంతా ఈ ఉగాది సంబరాల్లో పాల్గొని జయప్రదం చేయాలని వీరు కోరారు.ఈ సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ లు డి .రవికుమార్, పితాని ప్రసాద్, ఉపాధ్యక్షులు బండారు శివప్రసాద్,రామకృష్ణ జాయింట్ సెక్రెటరీ రాంబాబు,నగేష్ బ్రాడ్ కాస్ట్ అధ్యక్షుడు ఇరొతి ఈశ్వరరావు  కార్యదర్శి మాధవ్, స్మాల్ పేపర్స్ అసోసియేషన్ జగన్మోహన్,కార్యదర్శి బొబ్బర ప్రసాద్, కార్యవర్గ సభ్యులు కె వి శర్మ, మధురవాడ ఆనంద్, రాజశేఖర్, కిషోర్, హరి,

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...