Skip to main content

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ*సాధారణ పరిపాలన విభాగం* 18.03.2026* *విశాఖపట్నం పోర్ట్ ను సందర్శించిన నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ఫ్యాకల్టీ, కోర్స్ సభ్యులు* …

16 మంది సభ్యులతో కూడిన నేషనల్ డిఫెన్స్ కాలేజ్ (NDC) ఫ్యాకల్టీ మరియూ కోర్స్ సభ్యుల బృందం విశాఖపట్నం బుధవారం విశాఖపట్నం పోర్ట్ అథారిటీని సందర్శించారు. పోర్ట్  ఉపాధ్యక్షురాలు శ్రీమతి రోష్ని అపరంజి కొరాటి, IAS, ఎన్‌డీసీ బృందానికి సాదర స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా పోర్ట్ లో న్న మౌలిక సదుపాయాలు, కార్గో నిర్వహణ సామర్థ్యాలు, ఆధునీకరణ మరియు యంత్రీకరణ, కవర్ స్టోరేజ్ సదుపాయాలు, సౌర శక్తి వినియోగం, అంతర్గత మరియు పారిశ్రామిక అవసరాల కోసం మలిన జల శుద్ధి కేంద్రం, విశాఖ అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ అభివృద్ధి వంటి అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిప్యూటీ చైర్ పర్సన్…బృందానికి వివరించారు.

ఈ సందర్భంగా విశాఖపట్నం పోర్ట్ ఇచ్చిన ఆతిథ్యం పట్ల ఎన్డీసీ బృందం పోర్ట్ డిప్యూటీ చైర్ పర్సన్ మరియు సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోర్ట్ కార్యదర్శి శ్రీ ఎం. శంకర బాబు, విభాగాధిపతులు మరియు సీనియర్ అధికారులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...