జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు
గంట్ల శ్రీనుబాబు రంజాన్ తోఫా అందజేశారు.. ఈ మేరకు బుధవారం అక్కయ్యపాలెంలోని
తన కార్యాలయంలో జర్నలిస్టులకు రంజాన్ పండుగ కానుకగా 20,000 నగదు అందజేశారు.. అలాగే వీరికి ప్రత్యేక బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ
ప్రతి ఏటా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం జర్నలిస్టులకు గత 15 ఏళ్లుగా తన పరిధి మేరకు తోఫా అందజేస్తున్నట్లు చెప్పారు.. అలాగే
ఈ ఏడాది ప్రత్యేక బహుమతులు కూడా అందజేశామన్నారు.. రంజాన్ పర్వదినం వేళ లోకమంతా సుభిక్షంగా ఉండాలని
తాను కోరుకున్నట్లు చెప్పారు.. జర్నలిస్టులకు నిరంతరం అండగా ఉంటానని తన పరిధి మేరకు వారికి ఎప్పటికప్పుడు సహాయం అందిస్తూనే ఉంటానన్నారు.. నిరుపేద విద్యార్థులకు ప్రతి ఏటా విద్యా ప్రోత్సాహకాలు అలాగే వైద్యానికి సంబంధించి ఎంతో కొంత ఆర్థిక సహాయం తాను అందిస్తున్నట్లు చెప్పారు.. ఈ కార్యక్రమంలోముస్లిం జర్నలిస్టుల సంఘం ప్రతినిధులు
మౌలానా.. గయాజ్.. ఇస్మాయిల్..
సాదిక్.. అహ్మద్ తదితరులంతా పాల్గొన్నారు
Sharma K.V.Editor

Comments
Post a Comment