Skip to main content

ఎన్ ఎమ్ ఎమ్ ఎస్ 2026 ఫలితాలల్లో కొమరగిరిపట్నం ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రభంజనం....

 అల్లవరం, విశాఖ సందేసం..ఎన్ ఎమ్ ఎమ్ ఎస్  2026 ఫలితాలల్లో  కొమరగిరిపట్నం   శ్రీ న్యాపతి సుబ్బారావు పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు.14 మంది విద్యార్థులు అర్హత సాధించుట ద్వారా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొదటి స్థానం కైవసం చేసుకున్నారు.   ఈ అసామాన్య విజయం సాధించిన విద్యార్థులకు, విశేషంగా కృషి చేసిన స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్  ఏ .దుర్గాప్రసాద్, సహకరించిన ప్రధానోపాధ్యాయులు  ఎస్ సత్యనారాయణ మరియు ఉపాధ్యాయ బృందానికి రాష్ట్ర ,జిల్లా స్థాయి అధికారులు మరియు ప్రముఖ నాయకులు మరియు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు, గ్రామ పెద్దల నుండి ప్రశంసల వెల్లువతో పాటు అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు ఇటువంటి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...